- Advertisement -
నిజమే. సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజినీకాంత్ మనసు గాయపడింది. నెల నుంచీ తమిళనాడును కుదిపేస్తున్న భారీ వర్షాలు.. సూపర్ స్టార్ ను తీవ్రంగా బాధించాయి. అందుకే.. ఈ ఏడాది పుట్టినరోజు వేడుకలు చేసుకోవద్దని రజినీ నిర్ణయించారట.
వేడుకలకు దూరంగా ఉండడమే కాదు. వరద బాధిత ప్రాంతాల్లో స్వయంగా సహాయ చర్యలు చేయాలని కూడా రజినీ డిసైడయ్యారు. అంతే కాదు.. తన అభిమానులనూ సహాయ చర్యలు చేయాలని కోరారు.
బాలీవుడ్ సూపర్ స్టార్ దిలీప్ కుమార్ కూడా రజినీనే ఫాలో అవుతున్నారు. చెన్నై ప్రజలు కష్టాల్లో ఉన్నపుడు పుట్టినరోజు వేడుకలు చేసుకోవడం ఇష్టం లేకే.. కుటుంబసభ్యుల మధ్యలో సెలెబ్రేట్ చేసుకుంటున్నారట.