సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రత్యేక విమానంలో అమెరికాకు వెళ్లబోతున్నారు. ఆయన అమెరికా పర్యటనకు కేంద్ర ప్రభుత్వం కూడా ఆమోదం తెలిపింది. రజనీకాంత్ ఓ ప్రత్యేక విమానంలో తన కుటుంబసభ్యులతో కలిసి అమెరికా వెళ్లబోతున్నట్టు సమాచారం. ఆ విమానంలో మొత్తం 14 మంది వెళ్లనున్నారట. రజనీ చాలా ఏళ్లుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న విషయం తెలిసిందే. అందుకే ఆయన పొలిటికల్ ఎంట్రీ నుంచి తప్పుకున్నారు.
గత ఏడాది కూడా రజనీ కాంత్ అమెరికాలో చికిత్స తీసుకున్నారు. కొన్ని నెలల పాటు అక్కడే ఉన్నారు. ప్రస్తుతం రజనీకాంత్ అమెరికాలో ప్రపంచ ప్రఖ్యాత డాక్టర్ల సమక్షంలో కొన్ని కీలక పరీక్షలు చేయించుకోనున్నారు. అందుకే ఆయన అమెరికాకు వెళ్లబోతున్నారట.కుటంబసభ్యులు, వ్యక్తిగత సహాయకులు మాత్రమే ఈ పర్యటకు వెళ్లబోతున్నారు. రజనీకాంత్ చాలా ఏళ్లుగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. దీంతో ఆయన తరుచూ అమెరికాలో వైద్య పరీక్షలు చేయించుకుంటున్నారు.
రజనీకాంత్ ప్రస్తుతం అన్మాత్తే చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. కరోనా ఎఫెక్ట్తో ఈ మూవీ షూటింగ్ ఆగిపోయింది. అయితే ఆయన వెర్షన్ వరకు షూటింగ్ కంప్లీట్ అయ్యింది.మరోవైపు రజనీ కాంత్ అల్లుడు ధనుష్ సైతం అమెరికాలోనే ఉన్నారు. అయితే రజనీకాంత్ పర్యటనకు సంబంధించిన వివరాలు ఏవీ ఇంకా తెలియరాలేదు. అతి త్వరలోనే ఆయన అమెరికాకు వెళ్లబోతున్నట్టు సమాచారం.
Also Read
కమల్ను ఇండియన్ -2 శనిలా వెంటాడుతోంది?
బాలీవుడ్ను ఆదుకొనేది అక్షయేనా?
నెటిజన్ల రేటింగ్స్.. మాస్టర్ టాప్.. వకీల్ సాబ్, క్రాక్ జోరు