కరోనాతో సినిమా ఇండస్ట్రీ కుదేలైన విషయం తెలిసిందే. ఫస్ట్వేవ్తో నష్టాల పాలైన సినిమా ఇండస్ట్రీ.. సెకండ్ వేవ్తో కోలుకోలేని దెబ్బతిన్నది. ముఖ్యంగా ఈ రంగాన్ని నమ్ముకున్న కార్మికులు వీధినపడ్డారు. బాలీవుడ్మీద కరోనా ప్రభావం ఎక్కువ పడింది. అందుకు కారణం.. బాలీవుడ్ అంటే ముంబై.. కేసులు మహారాష్ట్రలోనే ఎక్కువగా నమోదయ్యాయి. దీంతో షూటింగ్ లు నిలిచిపోయిన పరిస్థితి. పలువురు సినీ కార్మికులు సైతం కరోనాకు బలయ్యారు.
కరోనా కారణంగా బాలీవుడ్ లో ఇప్పుడు అక్షయ్ కుమార్ సినిమాలు అధికంగా విడుదలకు నోచుకోకుండా ఉండిపోయాయి. అందుకు కారణం బాలీవుడ్ లో అత్యధిక సినిమాలు చేసేది అక్షయ్యే. అన్ని జోనర్లలో నటించడం అక్షయ్ స్టయిల్. ఎన్నో విభిన్న పాత్రలు, కామెడీ పాత్రలు, యాక్షన్ పాత్రలు చేస్తూ ఆడియన్స్ను ఎంటర్ టెయిన్ చేస్తుంటాడు. అయితే ఇప్పుడు బాలీవుడ్ గాడిన పడాలంటే అక్షయ్ సినిమాలు రిలీజ్ కావాల్సిందే అంటున్నారు సినీ విశ్లేషకులు . ప్రస్తుతం కరోనా కొద్దిగా తగ్గుముఖం పట్టింది. ఆగస్టులో థియేటర్లు ఓపెన్ చేసే పరిస్థితి ఉందని అంచనాలు వస్తున్నాయి.
Also Read:ఈ సారి పవన్ నుంచి ఫన్ ఒక్కటే కాదు.. మెసేజ్ కూడా..!
మరోవైపు థర్డ్వేవ్ కూడా భయపెడుతున్నది. అక్షయ్ నుంచి సుమారు 6 సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ‘సూర్యవంశీ’ ‘బెల్బాటమ్’, ‘ఆత్రంగి’ వంటి సినిమాల షూటింగ్ దాదాపు పూర్తయ్యింది. ఇక ‘బచ్చన్ పాండే’, ‘రక్షాబంధన్’, రామ్ సేతు’ సినిమాలు కూడా షూటింగ్ జరుపుకుంటున్నాయి. ఇవి కాక ‘పృథ్వీ రాజ్’ అనే భారీ చిత్రం రెడీగా ఉంది. ఈ చిత్రాలన్నీ వెంట వెంటనే విడుదలైతే .. బాలీవుడ్ ఇండస్ట్రీ కోలుకొనే అవకాశం ఉందంటున్నారు సినీ విశ్లేషకులు.మొత్తానికి బాలీవుడ్ను కాపాడే బాధ్యతను అక్షయ్ తన భుజస్కందాలమీద వేసుకున్నాడన్నమాట.
Also Read: మెగాస్టార్ వర్సెస్ రెబల్ స్టార్..!