Sunday, May 5, 2024
- Advertisement -

భగవద్గీత శ్లోకంతో మొదలై… ఊరమాస్ దెయ్యంతో ఆడుకున్న నాగ్

- Advertisement -

అంద‌రూ ఎంత‌గానొ ఎదురుచూస్తున్న రాజుగారి గ‌ది 2 ట్రైల‌ర్ వ‌చ్చేసింది. అక్కినేని నాగార్జున చిత్ర యూనిట్‌ ఈ సినిమా థియేట్రికల్‌ ట్రైలర్‌ను విడుదల చేసింది. భ‌గ‌వ‌ద్గీత శ్లోకంతో ట్రైల‌ర్‌ను లెజెండరీ యాక్టర్, దివంగత అక్కినేని నాగేశ్వరరావు పుట్టినరోజు సందర్భంగా నేడు(సెప్టెంబర్ 20) ఈ ట్రైలర్ రిలీజ్ చేశారు. ట్రైలర్ విడుదల తర్వాత సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. అక్టోబర్ 13న సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

రాజు గారి గ‌ది 2′. పి.వి.పి సినిమా, ఓక్ ఎంట‌ర్‌టైన్మెంట్స్ ప్రై.లి, మ్యాట్నీ ఎంట‌ర్ టైన్మెంట్స్ బ్యాన‌ర్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్నినిర్మిస్తున్నాయి. రేయ్‌.. మన రిసార్టులో దెయ్యం’ ఉందిరా అంటూ వెన్నెల కిషోర్‌ ఫ్రెండ్స్‌ దగ్గరకు పరుగెత్తుకుంటూ వచ్చి చెప్పే డైలాగ్‌తో ప్రారంభమైన ఈ ట్రైలర్‌ ఆధ్యంతం ఉత్కంఠను రేపింది. ఓంకార్ త‌న మార్క్‌ను చూపించిన‌ట్లు తెలుస్తోంది.

ఇక యువసామ్రాట్‌ అక్కినేని నాగార్జున ఎంట్రీ అదిరింది. ఓ యజ్ఞం జరిపిస్తూ ఆత్మ సమస్య నుంచి బయటపడేసే ఓ మెంటలిస్టుగా ఆయన ఈ సినిమాలో కనిపించనున్నారు. భగవద్గీత శ్లోకంతో మొదలై… ఊరమాస్ దెయ్యంతో ఆడుకున్న నాగ్… ‘రాజుగారిగది-2’ ట్రయిలర్ చూడండి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -