Wednesday, May 22, 2024
- Advertisement -

నా ఆలోచనలు తప్పని నాకు అర్థమైంది: రకుల్

- Advertisement -

ప్రార్థనా ప్రతి రూపాయి కౌంట్ ఇక్కడ.. అంటూ వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ ద్వారా ఎంతోమంది కుర్రకారులను ఆకట్టుకున్న నటి రకుల్ ప్రీత్ సింగ్ ఏకంగా కొంత కాలంలోనే స్టార్ హీరోయిన్ హోదాను దక్కించుకున్నారు. కేవలం తెలుగులో మాత్రమే కాకుండా బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా మంచి గుర్తింపును సంపాదించుకున్న రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు. ఒకవైపు సినిమాలతో బిజీగా ఉంటూ తన శరీర ఫిట్నెస్ పై ఈ అమ్మడు దృష్టి పెట్టారు.

ఈ సందర్భంగా రకుల్ ప్రీత్ సింగ్ మాట్లాడుతూ మనం సంతోషంగా ఉన్నాము అంటే కేవలం శారీరకంగా మాత్రమే కాకుండా మానసికంగా కూడా ఎంతో ధైర్యంగా ఉండాలి.ఏదైనా కష్టం వాటిల్లినప్పుడు మనకు మనమే ధైర్యం చెప్పుకునే స్థాయిలో ఉండాలని తెలిపారు. ఈ క్రమంలోనే మానసిక ఆనందం కలగాలంటే తప్పకుండా యోగా చేయాలని తెలిపారు.

Also read:ఆట ఫెమ్ గీతిక ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా?

మొదట్లో యోగా చేయడం అంటే చాలా బోర్ కొడుతుందేమో అనుకొనే దానిని కానీ ఒకసారి యోగా చేయడం మొదలు పెట్టిన తర్వాత నా ఆలోచనలు తప్పని నాకు అర్థమైంది. యోగా చేయటం వల్ల ఎన్నో సత్ఫలితాలు ఉంటాయని, అదేవిధంగా మన ఆలోచనా ధోరణిలో కూడా మార్పులు చోటుచేసుకుంటాయని తెలిపారు. మన శరీరానికి కావాల్సినంత ఎనర్జీ కావాలంటే తప్పకుండా యోగా చేయాలని ఈ సందర్భంగా రకుల్ ప్రీత్ తెలిపారు.

Also read:హ్యాపీ డేస్ అంటూ యాంకర్ రవి షోకు వచ్చిన టిక్ టాక్ భార్గవ్?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -