Monday, May 13, 2024
- Advertisement -

జన సైనికుల దృష్టిలో బాబాయి ఎలా ఉంటాడో చెప్పే ఓ పాట ఇది – రామ్ చ‌ర‌ణ్‌

- Advertisement -

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ఎప్ప‌టిక‌ప్పుడు బాబాయ్ ప‌వ‌ర్‌స్టార్ ,జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్‌పై త‌న ప్రేమ‌ను చూపిస్తునే ఉన్నాడు. గ‌తంలో చాలాసార్లు ప‌వ‌న్ గురించి మాట్లాడిన చ‌ర‌ణ్ ,తాజాగా మ‌రోసారి ప‌వ‌న్ కల్యాణ్ గురించి చెప్పుకొచ్చాడు. రాజ‌కీయంగా ప‌వ‌న్‌కు మ‌ద్ద‌తు తెలుపుతున్నాడు రామ్ చ‌ర‌ణ్. ప్ర‌స్తుతం ప‌వ‌న్ ఏపీ రాజ‌కీయల‌పై దృష్టి పెట్టిన సంగ‌తి తెలిసిందే. వ‌చ్చే ఎన్నిక‌ల‌లో ప‌వ‌న్ పార్టీ జ‌న‌సేన ఏపీలో ఎన్నిక‌ల‌కు స‌న్న‌ద్దం అవుతోంది. ఈ క్ర‌మంలో ప‌వ‌న్ వ్య‌క్తిత్వం గురించి తెలిపేలా ఓ సాంగ్‌ను రూపొందించారు అభిమానులు.

ఒకడొచ్చాడు.. వచ్చాడు.. జాతిని జాగృతి గొలుప..’ అంటూ ఈ పాట సాగుతుంది. తాజాగా ఈ పాట‌పై స్పందించాడు రామ్ చ‌ర‌ణ్. పాట చాలా బాగుంద‌ని ,బాబాయ్ వ్య‌క్తిత్వం తెలిపేలా పాట రాశార‌ని కితాబునిచ్చాడు రామ చ‌ర‌ణ్. నా దృష్టిలో లక్షలాది అభిమానుల దృష్టిలో, అంతకన్నా ఎక్కువ ఉండే జన సైనికుల దృష్టిలో బాబాయి ఎలా ఉంటాడో చెప్పే ఓ పాట ఇది అంటూ చరణ్ తన వివరణను ఇచ్చాడు. ప్ర‌స్తుతం ఈ పాట సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -