Saturday, May 4, 2024
- Advertisement -

బాబాయ్‌కు మద్దతుగా అబ్బాయ్‌ ప్రచారం

- Advertisement -

జనసేన అధ్యక్షడు పవన్‌ కల్యాణ్‌కు తీవ్ర అస్వస్థతకు గురి అయిన సంగతి తెలిసిందే. ప్రచారం మరో రెండో రోజుల్లో ముగియనుండటంతో ప్రచారం చేయకపోతే కష్టం అని జనసేన కార్యకర్తలు భావిస్తున్నారు. దీంతో బాబాయ్‌కు మద్దతుగా అబ్బాయ్‌ మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ రంగంలోకి దిగుతున్నాడు. పవన్‌ ప్రచారానికి దూరంగా ఉండటంతో పార్టీ తరుపున ప్రచారం నిర్వహించనున్నారు.

శనివారం సాయంత్రం హైదరాబాద్ నుంచి రామ్ చరణ్ బయలుదేరి విజయవాడ చేరుకుంటారు. మొదట ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న బాబాయ్‌ పవన్‌ను పరామర్శిస్తారు. ఆ తరువాత పార్టీ నాయకులతో చర్చిస్తారని తెలుస్తోంది. తరువాత పవన్‌తో పాటు ఎన్నికల ప్రచారంలో కూడా రామ్‌చరణ్ పాల్గొంటారు. కాగా, నాగబాబు తరఫున కూడా రామ్‌చరణ్ ప్రచారం చేయనున్నారు. ప్రచారంలో పాల్గొనడంతో పాటు చెర్రీ బహిరంగ సభల్లో ప్రసంగిస్తారని తెలుస్తోంది. ఇప్పటికే మెగా హీరో వరుణ్‌ తేజ్‌, మెగా డాటర్‌ హీరోయిన్‌ నిహారిక కూడా తన తండ్రి నాగబాబు తరుపున ప్రచారం నిర్వహిస్తున్నారు. అల్లు అర్జున్ మాత్రం తాను ప్రచారానికి రాకపోయినా నాగబాబు, పవన్‌కు పూర్తి మద్దతు ఉంటుందని ఓ ప్రకటనలో తెలిపారు. మరి మెగా హీరోల ప్రచారం ఎంత వరకు ఫలిస్తుందో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -