ఈ మధ్యనే బాలీవుడ్ లో ‘బ్రదర్స్’ అనే సినిమా వచ్చింది. విశేషం ఏమిటంటే అది హాలీవుడ్ సినిమా ‘వారియర్’ కు రీమేక్. ఆ సినిమా హక్కులను మరీ హిందీలో రీమేక్ చేశారు. అక్కడ ఈ సినిమా అందుకు తగ్గఫలితాన్ని పొందింది.
సూపర్ హిట్ అయ్యింది. సాధారణఃగా హాలీవుడ్ నుంచి కథలను కాపీ కొట్టుకు వచ్చి సినిమాలు రూపొందించడమే కానీ.. మనోళ్లు హక్కులు కొని రీమేక్ చేయడం అరుదుగా జరుగుతుంటుంది. ‘బ్రదర్స్’ విషయంలో అదే జరిగింది.
మరి ఇప్పుడు విశేషం ఏమిటంటే.. ఈ సినిమాను ఇప్పుడు తెలుగులో రీమేక్ చేయనున్నారనే వార్తలు వస్తున్నాయి. అది కూడా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ ఈ సబ్జెక్టును టేకప్ చేయబోతున్నాడట. చరణ్ బ్రదర్ గా రాణా నటించే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ఈ విధంగా వీరిద్దరి కాంబినేషన్ లో తెలుగులో హాలీవుడ్ సబ్జెక్ట్ వయా బాలీవుడ్ గా రీమేక్ కానున్నదని తెలుస్తోంది.
అలాగే ఈ సినిమా తమిళంలో కూడా రూపొందనున్నదని అంటున్నారు. అక్కడ రియల్ లైఫ్ బ్రదర్స్ సూర్య,కార్తీలు నటించనున్నారని సమాచారం. మొత్తానికి ఇవన్నీ ఆసక్తికరమైన కాంబినేషన్లే!