Sunday, May 19, 2024
- Advertisement -

దుమ్మురేపుతున్న ‘రంగస్థలం’ ఓవ‌ర్సీస్ క‌లెక్ష‌న్లు

- Advertisement -

వేస‌వి సినీ పండుగ‌కు మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ శుభారంభం చేశాడు. తాను హీరోగా సుకుమార్ ద‌ర్శ‌కత్వంలో న‌టించిన సినిమా ‘రంగస్థలం’ మార్చి 30వ తేదీన విడుద‌లై మంచి టాక్‌తో దూసుకుపోతోంది. తొలి రోజు శుక్ర‌వారం క‌లెక్ష‌న్లు భారీగా రాబ‌ట్టుకొని సినిమా మంచి వ‌సూళ్లు సాధిస్తోంది.

ప‌ల్లెటూరి నేప‌థ్యంలో రూపొందించిన సినిమా కావ‌డంతో విదేశాల్లో ఉన్న ప్రేక్ష‌కులు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నాడు. తాము జీవించిన ప‌రిస్థితులను మ‌రోసారి ‘రంగస్థలం’తో గుర్తు చేసుకున్న‌ట్టు ఫీల‌వుతున్నారు. అందుకే తెలుగు రాష్ట్రాల్లో క‌న్నా ఓవ‌ర్సీస్‌లో క‌లెక్ష‌న్ల సునామీ కురుస్తోంది. ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.

పల్లెటూరి నేపథ్యంతో తెరకెక్కిన ఈ సినిమా బాగుందని టాక్‌ రావడం, రామ్‌చరణ్‌, సమంత న‌ట‌న‌కు అంద‌రూ ఫిదా అవుతున్నారు. ‘రంగస్థలం’ ఓవర్సీస్‌ మార్కెట్‌లోనూ దుమ్మురేపుతోంది. అమెరికా బాక్సాఫీస్‌ వద్ద ‘రంగస్థలం’ అప్పుడే మన మిలియన్‌ మార్క్‌ను అధిగమించింది. ప్రీమియర్‌ షోలు, మొదటి రోజు వసూళ్లు బాగుండడంతో ఈ సినిమా ఈ మార్క్‌ను అధిగమించింది. సినిమా టాక్‌ బాగుండడంతో వసూళ్లు ఇంకా పెరుగుతాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -