మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రకుల్ హీరోయిన్ గా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ధృవ’. మరొ కొద్ది గంటల్లో ఈ సినిమా థియేటర్లలో సందడి చేయబోతుంది. గోవిందుడు అందరివాడేలే – బ్రూస్లీ లాంటి రెండు ప్లాప్ సినిమాల తర్వాత చరణ్ నటిస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాతో పెద్ద హిట్ కొట్టాలని చూస్తున్నాడు చరణ్.
ఇక చరణ్ ధృవ తర్వాత వరుసగా మూడు సినిమాలను లైన్లో పెట్టేశాడు. ధృవ తర్వాత సుకుమార్ దర్శకత్వంలో నటిస్తున్న చరణ్ ఈ సినిమా షూటింగ్ జాయిమ్ కానున్నాడు. సుకుమార్ సినిమా తర్వాత మణిరత్నం దర్శకత్వంలో ఓ ద్విభాషా చిత్రంలో నటించేందుకు కూడా చర్చలు జరుపుతున్నారు.
ప్రస్తుతం మణిరత్నంతో స్క్రిప్ట్ విషయమై చర్చలు జరుగుతున్నాయని చరణ్ స్వయంగా తెలిపారు. మణిరత్నం సినిమా తర్వాత చెర్రీ మూడు వరుస బ్లాక్బస్టర్ హిట్స్తో టాలీవుడ్లో తిరుగులేని క్రేజీ డైరెక్టర్ అయిన కొరటాల శివతో సినిమా చేసేందుకు చర్చలు జరుపుతున్నాడట. ప్రస్తుతం మహేష్ తో ఓ సినిమా చేస్తున్న కొరటాల.. ఆ సినిమా కంప్లీట్ అవ్వగానే చెర్రీ కోసం స్క్రిఫ్ట్ రెడీ చేస్తాడట. ఇలా ధృవ తర్వాత చెర్రీ వరుసగా మూడు సినిమాలను పట్టాలెక్కించేందుకు రంగం సిద్ధం చేసుకోవడం విశేషం.
Related