Friday, May 17, 2024
- Advertisement -

రామ్ చరణ్ కోసం కేటీఆర్ ఏం చేస్తున్నారో తెలుసా?

- Advertisement -
KTR Chief guest for Dhruva Pre release Function

రామ్ చరణ్ కి సంబంధించి ఏ సినిమా ఆడియో వేడుకకు అయినా ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవే వస్తుంటారు. అయితే ఈ సారి మాత్రం చరణ్ సినిమా ఆడియో వేడుకలో ఓ విశిష్ట అతిథి సందడి చేయనున్నారు. రామ్ చరణ్ ప్రస్తుతం నటిస్తున్న ‘ధృవ’ ప్రి రిలీజ్ పంక్షన్లో డిసెంబరు 4న హైదరాబాద్ లోని యూసుఫ్ గూడ పోలీస్ లైన్స్ లో చేయనున్న విషయం తెలిసిందే.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు హాజరు కాబోతున్నారు. చిరంజీవితో పాటు మెగా ఫ్యామిలీకి చెందిన మరికొంతమంది హీరోలు కూడా ఈ వేడుకకు రాబోతున్నారు. ‘ధృవ’ ఒక పోలీస్ కథ కావడంతో ప్రి రిలీజ్ వేడుకకు వేదికను కూడా అందుకు తగ్గట్లే ఎంచుకున్నారు.

కొందరు పోలీసు ఉన్నతాధికారులు కూడా ఈ వేడుకలో పాల్గొంటారని సమాచారం.  అయితే ఎంత మంది వచ్చిన చరణ్ సినిమా వేడుకకు కేటీఆర్ రావడమే అతి పెద్ద విశేషం. కేటీఆర్.. ఈ మధ్య తెలుగు ఫిలిం సెలబ్రెటీలతో క్లోజ్ గా మూవ్ అవుతున్నారు. తరచుగా సినిమా వాళ్లతో మీటింగ్స్ పెడుతూ.. పరిశ్రమ అభివృద్ధి కోసం చర్యలు చేపడుతున్నాడు. ఇక రామ్ చరణ్ తో కేటీఆర్ కు మంచి సాన్నిహిత్యమే వుంది. ఆ మధ్య 10 కే రన్ కార్యక్రమంలో ఇద్దరూ కలిసి పాల్గొన్నారు. రామ్ చరణ్ కోసమే ఈ వేడుకకు కేటీఆర్ వస్తున్నట్లు తెలుస్తోంది. మరి ఈ వేడుకలో కేటీఆర్ ఏం మాట్లాడతారో చూడాలి.

Related

  1. రామ్ చరణ్ –  కేటీఆర్ స్నేహం వెనకాల రాజకీయ ముసుగు ? 
  2. రామ్ చరణ్, ఉపాస‌న మ‌ధ్య ఆ హీరోయిన్!
  3. శర్వానంద్ రామ్ చరణ్ తోడల్లుడు కాబోతున్నాడు?
  4. చరణ్ కు విలన్ గా మారిన సప్తగిరి

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -