ఓ క్రేజీ హీరోయిన్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ కు ఉపాసనకు మధ్య పెద్ద చిచ్చు పెట్టిందట. అసలు ఈ ఇద్దరి మధ్య చిచ్చు పెట్టిన ఆ క్రేజీ హీరోయిన్ ఎవరు ఆ సంగతేంటో చూద్దాం. ప్రస్తుతం రామ్ చరన్ సురేందర్రెడ్డి దర్శకత్వంలో ధృవ అనే సినిమాలో నటిస్తున్నాడు.
అయితే ఈ సినిమా ఫైనల్ సాంగ్ షూటింగ్ కోసం రకుల్ ప్రీత్ తో కలిసి థాయ్ ల్యాండ్ వెళ్లిన సంగతి తెలిసిందే. ఇది షూటింగ్ కోసం వెళ్లిన టూర్ అయినా.. తన వైఫ్ ఉపాసనను కూడా వెంటబెట్టుకుని వెళ్లాడు. అక్కడ రామ్ చరణ్, రకుల్ ఇద్దరూ కలిసి చాలా క్లోజ్గా ఉత్సాహంగా పని చేసేస్తున్నారట. ఇది చూసిన ఉపాసనకి గిల్టీగా ఉందిట.
‘వీకెండ్ ఆనందంగానే ఉన్నా.. గిల్టీగా ఉంది. రామ్ చరణ్ వర్క్ చూస్తుంటే ఉత్సాహం వస్తోంది. హార్డ్ వర్కింగ్ హజ్బెండ్’ అంటూ ట్వీట్ చేసింది ఉపాసన. ‘నటుల పని అసలేమాత్రం సులభం కాదు. డెస్క్ వెనకాల పనిచేయడానికే ప్రిఫరెన్స్. రామ్ చరణ్.. రకుల్ ప్రీత్ లకు నా రెస్పెక్ట్’ అని ఉపాసన చెపుతోంది. ఇక ధృవ విషయంకు వస్తే.. ఇటివలే రిలీజ్ అయిన ఈ సినిమా పాటలకు మంచి స్పందన వస్తోంది. త్వరలోనే ఈ సినిమా విడుదల కానుంది.
Related