ఎల్లప్పడూ సామాజిక మాధ్యమాల్లో వైరల్గా ఉండే దర్శకుడు వర్మ ఓ సినిమా విషయంలో క్లారిటీ ఇచ్చాడు. నాగార్జునతో చేస్తున్న సినిమాలో బాలీవుడ్ మెగస్టార్ అమితాబ్ బచ్చన్, టబు నటిస్తున్నారనే పుకార్లపై ఆయన స్పందించాడు. వారిద్దరూ ఈ చిత్రంలో నటించడం లేదు. ఆ వార్తలు పూర్తిగా అవాస్తవం అని ఫేస్బుక్లో ప్రకటించాడు. అయితే తాను తీస్తున్న ఈ సినిమా ఈ నెల 20వ తేదీ నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.
వరుస పరాజయాలతో ఉన్న వర్మ ఈసారి ఎలాగైనా బ్లాక్ బస్టర్ కొట్టాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు. శివ చిత్రంతో నాగార్జున, వర్మ పూర్తిగా ఫామ్లోకి వచ్చారు. ఆ చిత్రం వారిద్దరికీ బ్లాక్బస్టర్గా నిలిచింది. ఇప్పుడు కూడా నాగార్జునతో సినిమా తీసి తన భవిష్యత్ను తేల్చుకోనున్నాడు. ఈ సినిమా తర్వాత మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు జీవితంపై లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం తీయనున్నాడు. ఈ చిత్రం ప్రకటించిన నాటి నుంచి వివాదాస్పదమవుతూనే ఉంది.