Sunday, April 28, 2024
- Advertisement -

శ్రీదేవి బ‌యోపిక్… డైరెక్ట‌ర్ ఎవ‌రో తెలుసా….?

- Advertisement -

అనంత‌లోకాల‌కి వెళ్ళిన అందాల తార శ్రీదేవి మ‌ర‌ణాన్ని సంచ‌ల‌న ద‌ర్శకుడు రామ్ గోపాల్ వ‌ర్మ అసలు తట్టుకోలేకపోతున్నారు. శ్రీదేవీ మరణించిందన్న విషయం తెలిసిన దగ్గర్నుంచి వర్మ బాధ వర్ణనాతీతం. శ్రీదేవి మ‌ర‌ణించిన ద‌గ్గ‌ర్నుంచి వ‌ర్మ అజ్ణాతంలోకి వెల్లారు. శ్రీదేవిమీదున్న త‌న అభిమానాన్ని చంపులోలేక వ‌ర‌సు ట్వీట్‌లు చేశారు వ‌ర్మ‌.

సముద్రమంత ప్రేమను కురిపిస్తున్న అభిమానుల కోసమైనా దేవుడు తన మనసును మార్చుకుని ఆమెని వెనక్కి పంపాలంటూ పలు ట్వీట్స్‌ సైతం చేశారు. శ్రీదేవీ జీవితం గురించి ఎవరికీ తెలియని విషయాలంటూ అభిమానులకు ఓ ప్రేమ లేఖ కూడా రాశాడు. ఇప్పుడిక శ్రీదేవీ జీవితంపై సినిమా తీయాలని నిర్ణయించారట.

శ్రీదేవీ జీవితం రామ్‌ గోపాల్‌ వర్మ సినిమా తీయబోతున్నారంటూ.. ఆయనకు అత్యంత సన్నిహితుడు, గీత రచయిత సిరశ్రీ ఓ టీవీ ఛానల్‌ ప్రొగ్రామ్‌లో చెప్పినట్టు తెలుస్తోంది. స్టోరీ తుది రూపం దాల్చగానే, ఈ బయోపిక్‌పై వర్మ అధికారిక ప్రకటన చేస్తారంటూ సిరశ్రీ చెప్పినట్టు సమాచారం. అయితే ఇప్పటి వరకు ఆర్‌జీవీ నుంచి దీనిపై ఎలాంటి ప్రకటనలు రాలేదు. అయితే రామ్‌ గోపాల్‌ వర్మ, శ్రీదేవీ జీవితంపై సినిమా తీయబోతున్నాడంటూ వార్తలు హల్‌ చల్‌ చేస్తున్నాయి.

బ‌యోపిక్‌ల‌ను ఎప్పుడూ వివాదాస్ప‌దంగా తీసే వ‌ర్మ శ్రీదేవి బ‌యోపిక్‌ను ఏఏ కోణాల్లో తెరకెక్కిస్తారంటూ సర్వత్రా చర్చనీయాంశమైంది. శ్రీదేవీని అమితంగా ప్రేమించే రామ్‌ గోపాల్‌ వర్మ, ఆమెతో పాటు క్షణం క్షణం సినిమా తీశారు . ఇప్పుడు బ‌యోపిక్‌పై వ‌ర్మ స్పందించాల్సి ఉంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -