Thursday, April 25, 2024
- Advertisement -

రామ్ గోపాల్ వర్మ సంచలన ట్వీట్

- Advertisement -

ఏపీ సీఎం జగన్ తో సినీ ప్రముఖులు భేటీపై తనదైశ శైలిలో సెటైర్లు వేశారు సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. మెగాస్టార్ చిరంజీవి ఆధ్వ‌ర్యంలో గురువారం ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్‌తో టాలీవుడ్ ప్రముఖుల బృందం భేటీ అయిన విషయం తెలిసిందే. ఈ సమావేశానికి చిరంజీవితో పాటు మహేష్ బాబు, ప్రభాస్, రాజమౌళి, కొరటాల శివ, ఆర్ నారాయణ మూర్తి తదితరులు హాజరయ్యారు. చిన్న సినిమాలకు గాను 5 షోలకు అనుమతి లభించింది.

సినిమా సమస్యలకు పరిష్కారం లభించింది..అని సమావేశం తరువాత జరిగిన ప్రెస్ మీట్‌లో అంతా చెప్పుకొచ్చారు. ఇప్పటికి శుభం కార్డు పడిందన్న మెగా స్టార్.. మరో వారం లేదా 10 రోజుల్లో జీవో వచ్చే అవకాశం ఉందని కూడా ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే ఈ వ్యవహారంపై సోషల్ మీడియా వేదికగా ఆర్జీవీ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం సంచలనంగా మారింది.

సూపర్ స్టార్, మెగా స్టార్, బాహుబలిలు సీఎం జగన్ ముందు బిచ్చమెత్తుకున్నందు వల్లే సినిమా టిక్కెట్ల వ్యవహారం సద్ధుమణిగిందని అన్నారు. వీరి బెగ్గింగ్ చూసి వైఎస్ జగన్ వారిని ఆశీర్వదించారని చెప్పారు. సూపర్, మెగా, బాహుబలిని మించిన మహాబలులను ఎంతో అభినందిస్తున్నానంటూ వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. ఒమెగా స్టార్ అయినందుకు తాను సంతోషిస్తున్నానని ఈ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -