డైరెక్టర్ రాంగోపాల్ వర్మ, నిర్మాత నట్టికుమార్ మధ్య వివాదం ముదురుతోంది. ఇప్పటికే ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నారు. తాజాగా దర్శకుడు రాంగోపాల్ వర్మ పంజాగుట్ట పీఎస్ లో నట్టికుమార్ పై ఫిర్యాదు చేశాడు. మా ఇష్టం సినిమాకు సంబంధించిన కాపిరైట్స్ తనవేనని ఆర్జీవీ స్పష్టం చేశారు.
నట్టి కుమార్, నట్టి కరుణ, నట్టి క్రాంతి తన లెటర్ హెడ్ మీద సంతకం ఫోర్జరీ చేశారని పోలీసులకు కంప్లైంట్ చేశాడు. మా ఇష్టం సినిమాపై ఇప్పటికే కోర్టు స్టే ఉందని ఆర్జీవీ గుర్తు చేశాడు. ఆర్జీవీకి వ్యతిరేకంగా నట్టికుమార్ కొద్ది రోజుల క్రియం సివిల్ కోర్టులో పిటిషన్ వేశారు. వర్మ తనకు 5.29 కోట్లు ఇవ్వాలనీ..కానీ ఆయన తప్పించుకుని తిరుగుతున్నారంటూ కోర్టును ఆశ్రయించారు.
తనకు డబ్బు చెల్లించే వరకు మా ఇష్టం సినిమా నిలుపుదల చేయాలని విజ్ఙప్తి చేశారు. వాదనలు విన్న కోర్టు మా ఇష్టం’ సినిమా రిలీజ్ను ఆపాలని ఆదేశాలు జారీ చేసింది.