నేను శైలజ మూవీతో రామ్ కి హిట్టిచ్చాడు డైరెక్టర్ కిషోర్ తిరుమల. మొదటి సినిమాతోనే మంచి హిట్ కొట్టి.. పరిశ్రమ దృష్టిని ఆకర్షించాడు. దాంతో పలువురు హీరోలతో సినిమలను చేసే చాన్స్ ఆయన్ని వరించింది. వెంకటేష్ కి `ఆడాళ్లూ మీకు జోహార్లు` కథ చెప్పి ఓకే చేయించాడు కూడా. కానీ చివరి నిమిషంలో ఆ సినిమా ఆగిపోయింది.
అందుకే ఈసారి మళ్లీ తన తొలి సినిమా హీరోతోనే జట్టుకట్టాడు కిషోర్. నేను శైలజ తరహాలోనే ఓ రొమాంటిక్ లవ్ స్టోరీని తెరకెక్కించేందుకు సర్వం సన్నద్ధం చేసుకొన్నాడు. అయితే ఈ సారి తెరకెక్కే మూవీలో మాత్రం ఇద్దరు శైలజలు ఉన్నారు. అంటే రామ్ ఇద్దరు భామలతో ఆడిపాడబోతున్నారన్నమాట. ఆ ఇద్దరిలో ఒకరు అనుపమ పరమేశ్వరన్ కాగా – మరొకరు మేఘా ఆకాష్. ఏప్రిల్ 25 నుంచి ప్రారంభం కానున్న ఈ సినిమాని నేను శైలజ చిత్రాన్ని నిర్మించిన స్రవంతి రవికిషోరే నిర్మాత.
దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. కాస్త ఆలస్యమైనా భారీ సెటప్పుతోనే రంగంలోకి దిగుతున్న కిషోర్ తిరుమల మరోసారి హిట్టు కొట్టి తీరాలన్న కసితో కనిపిస్తున్నారు. అన్నట్టు ఈ సినిమాలో రామ్ బాడీలాంగ్వేజ్ లుక్ కొత్తగా ఉండబోతోందట. ఎప్పుడూ ఎనర్జిటిక్ గా కనిపించే రామ్ ని `నేను శైలజ`తోనే కొత్తగా ఆవిష్కరించిన కిషోర్ ఈసారి ఏ రకంగా చూపించబోతున్నారనేది చూడాలి.
{youtube}fK4NM-Ounco{/youtube}
Related