యంగ్ హీరో రామ్ స్క్రీన్ మీద ఎప్పుడు మంచి ఎనర్జితో ఉంటాడు. అందుకే రామ్ను ఎనర్జిటిక్ స్టార్ అని అంటారు. సినిమాలలో కనిపించనంత హూషారుగా బయట మాత్రం కనిపించడు రామ్. ఎప్పటికప్పడు తన సినిమాల గురించి సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తుంటాడు. కెరీర్ తొలినాళ్లలో వరుస హిట్లు కొట్టిన రామ్కు ఈ మధ్య సరైన హిట్లు లేవు. హలో గురు ప్రేమ కోసమే సినిమా కూడా యావరేజ్గానే ఆడింది. దీంతో వెంటనే రామ్కు మంచి సాలీడ్ హిట్ కావాలి.
అందుకే పూరి జగన్నాథ్ సినిమాలో నటిస్తున్నాడు రామ్. ఇక సినిమాలు తప్ప మరో ధ్యాస లేని రామ్ ఈ మధ్య పొలిటికల్ ట్విట్లు చేస్తు వార్తల్లో నిలుస్తున్నాడు. ఆ మధ్య తెలంగాణ ఎన్నికల సందర్భంగా అందరు తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని తన ట్విట్టర్ ద్వారా పిలుపునిచ్చి అందరిని ఆశ్చర్యపరిచాడు రామ్. మళ్లీ ఇన్నాళ్లకు రామ్ మరో ట్విట్ చేశాడు. ఈసారి ఏపీ సీఎం చంద్రబాబుపై ట్విట్ చేశాడు రామ్. ప్రముఖ కియా మోటర్స్ సంస్థ తమ కార్యకలపాలనే ఏపీలో ప్రారంభించింది. ఇటీవలే దీనికి సంబంధించిన తొలి కారును కూడా విడుదల చేశారు.
ఈ కార్యక్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు కూడా పాల్గొన్నారు. దీనిపై చంద్రబాబుని ప్రశంసిస్తు ట్విట్ చేశాడు రామ్. ఇలాంటి కార్యక్రమాలు ఏపీలో మరిన్ని జరగలని కోరుతు రామ్ ట్విట్ చేశాడు. రామ్ తన సినిమాల గురించే కాక, ఇలా అభివృద్ధి కార్యక్రమాల గురించి కూడా స్పందిచడం గొప్ప విషయం అంటు అతనిని ప్రశంసిస్తున్నారు నెటిజన్లు. రామ్ ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఐస్మార్ట్ శంకర్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్గా నిధి అగర్వాల్ నటిస్తుంది. ఈ సినిమా తనకు ఖచ్చితంగా హిట్ ఇస్తుందని భావిస్తున్నాడు రామ్.
- Advertisement -
చంద్రబాబుపై ట్విట్ చేసిన హీరో రామ్
- Advertisement -
Related Articles
- Advertisement -
Most Populer
- Advertisement -
Latest News
- Advertisement -