Friday, May 17, 2024
- Advertisement -

`రంగ‌స్థ‌లం` నైజాం హ‌క్కులు ఎవ‌రికో తెలుసా?

- Advertisement -

చెర్రీ సినిమాకు భారీ రేట్‌

ధృవ సినిమా విజ‌యంతో దూకుడుగా ఉన్న మెగా హీరో రామ్‌చ‌ర‌ణ్ తేజ్ త‌ర్వాతి సినిమాలు వ‌రుస పెట్టి చేస్తున్నాడు. చెర్రీ మార్కెట్ రేంజ్ ఇదివ‌ర‌క‌టితో పోలిస్తే రెట్టింపయ్యింద‌ని తెలుస్తోంది. `రంగ‌స్థ‌లం` ప్రీరిలీజ్ బిజినెస్ చెబుతోంది. ఏపీ, నైజాంలో ఈ సినిమా బిబినెస్ స్కైలో ఉంద‌ని తెలుస్తోంది. చ‌ర‌ణ్ సినిమా శాటిలైట్ స‌హా ప్ర‌తిదీ భారీ ధ‌ర ప‌లుకుతోందని ట్రేడ్‌లో విశ్లేషిస్తున్నారు.

`రంగ‌స్థ‌లం నైజాం ఏరియా రిలీజ్ హ‌క్కుల్ని భారీ పోటీ మ‌ధ్య యువీ క్రియేష‌న్స్ అధినేత‌లు ప్ర‌మోద్‌, వంశీ ద‌క్కించుకున్నార‌ని స‌మాచారం. 2 డిజిట్‌లో ఫ్యాన్సీ ధ‌ర ఆఫ‌ర్ చేసి నైజాం హ‌క్కులు త‌మ సొంతం చేసుకున్నారని టాక్‌. రామ్‌చ‌ర‌ణ్ కెరీర్‌లోనే నైజాంలో ఇదే పెద్ద ధ‌ర ఇదేన‌ని చెబుతున్నారు. ఇటీవ‌ల విడుద‌లైన ఎన్టీఆర్ జై ల‌వ‌కుశ‌, మ‌హేశ్‌బాబు స్పైడ‌ర్ సినిమాల క‌న్నా వాటిని త‌ల‌ద‌న్నే రేంజులో రేటు ప‌లికింద‌ని తెలుస్తోంది. ఈ పోటీలో నైజాం కింగ్ దిల్‌రాజు దిగినా రంగ‌స్థ‌లం నిర్మాత‌లు కోట్ చేసిన మొత్తం చూసి ఆయ‌న‌ వెన‌క్కి త‌గ్గారట‌. ఆ క్ర‌మంలోనే యువీ క్రియేష‌న్స్ ద‌క్కించుకుంద‌ని చెబుతున్నారు.

సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌స్తున్న ఈ సినిమాలో రామ్‌చ‌ర‌ణ్ స‌ర‌స‌న‌ స‌మంత న‌టిస్తోంది. దేవీశ్రీప్ర‌సాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఈ సినిమా మార్చిలో విడుద‌ల చేయ‌డానికి ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -