- పుస్తకాన్ని విడుదల చేసిన చెర్రీ
మెగాస్టార్ చిరంజీవి సినీ ప్రయాణంపై ఓ పుస్తకం వచ్చింది. ఆ పుస్తకంలో ఏమేమి ఉన్నాయో? ఆయన సినీ ప్రయాణంలో ఏమేమి ఎదుర్కొన్నారో తెలుసుకోవాలంటే పునాదిరాళ్లు చదవాల్సిందే అని చెర్రీ ప్రకటించాడు. సినీ నటుడిగా చిరంజీవిగా కెరీర్ ప్రారంభించి దాదాపు 40 ఏళ్లకు చేరువవుతోంది. చిరంజీవి ప్రాణం ఖరీదు తొలి సినిమా అయినా సినిమా కోసం మొదట మేకప్ వేసుకున్నది మాత్రం పునాదిరాళ్లు కోసమే. అందుకే ఆ సినిమా పేరు మీద రచయిత గౌతమ్ రావూరి ఓ పుస్తకాన్ని రచించారు.
ఈ పుస్తకాన్నిచిరంజీవి తనయుడు నటుడు రామ్చరణ్ ఆవిష్కరించారు. `ప్రాణం ఖరీదు` సినిమాతో చిరంజీవి కెరీర్ ప్రారంభమైనా `పునాది రాళ్లు` కోసం మేకప్ వేశారు. `పునాది రాళ్లు` సినిమా 2019 జూన్ 22కు 40 సంవత్సరాలు పూర్తి చేసుకోబోతోంది. మెగాస్టార్ కెరీర్ 40వసంతాలు పూర్తి కావడానికి మరో రెండేళ్ల సమయమే ఉంది. ఇక పునాది రాళ్లు పుస్తకానికి రెండో భాగం కూడా త్వరలో విడుదల చేస్తానని రచయిత గౌతమ్ రావూరి ప్రకటించారు. చిరంజీవి సినిమా నేపథ్యంలో వివరించేలా ఈ పుస్తకం ఉంది.