ఒకప్పటి హీరోయిన్ రమ్యకృష్ణ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మారిన తరువాత చాలా సినిమాలలో అవకాశాలు వచ్చాయి.కాని బాహుబలి సినిమా ఆమె దిశ,దశను మార్చేసిందని చెప్పాలి.ఈ సినిమాలో రమ్యకృష్ణ నటనకు విమర్శకుల ప్రశంసలు కూడా అందాయి.ఈ సినిమా తరువాత ఆమెకు వరస ఆఫర్లు వస్తున్నాయి.ఒకప్పుడు ఫలానా హీరోయినే కావలని అడిగేవారు,ఇప్పుడు రమ్యకృష్టే తమ సినిమాలో ఉండలని కండిషన్ పెడుతున్నారటా. త్వరలోనే ఆమె ప్రధానమైన పాత్రను పోషించిన ‘శైలజా రెడ్డి అల్లుడు’ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
హీరోయిన్స్ ఎంపిక కంటే ముందుగానే రమ్యకృష్ణ డేట్స్ ను తీసుకుంటున్నారని సమాచారం. తాజాగా మరో ప్రాజెక్టుకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ‘అప్పట్లో ఒకడుండేవాడు’ సినిమాతో హిట్ కొట్టిన దర్శకుడు సాగర్ చంద్ర .. వరుణ్ తేజ్ తో ఒక సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. ఈ సినిమాలో కీలకమైన పాత్ర కోసం రమ్యకృష్ణను సంప్రదించారటా!ఆమె ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని తెలుస్తుంది.దీని బట్టి చేస్తే హీరోయిన్లు కన్నా రమ్యకృష్ణ డిమాండ్ ఎక్కువుగా ఉన్నట్లుంది కాదా!