టాలీవుడ్లో ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగిన రమ్యకృష్ణ, తరువాత కాలంలో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మారి తనదైన శైలిలలో దూసుకుపోతుంది. హీరో, హీరోయిన్స్కు అమ్మ క్యారెక్టర్స్లో ఎక్కువుగా కనిపిస్తుంది రమ్యకృష్ణ. అయితే బాహుబలి సినిమా తరువాత రమ్యకృష్ణ రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది. బాహుబలి సినిమాలో శివగామిగా రమ్యకృష్ణ చేసిన నటనకు ఇండియా మొత్తం, ఆమె నటనకు ఫిదా అయ్యారు.
దీంతో ఆమెకు తెలుగులోనే కాక తమిళ, మళయాళ భాషలలో అవకాశాలు వస్తున్నాయి. దీంతో ఆమె రేమ్యూనిరేషన్ గురించి ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. రమ్యకృష్ణ ఒక్కో సినిమాకు హీరోయిన్ తీసుకునేంత రేమ్యూనిరేషన్ తీసుకుంటుందని సమాచారం. అయిన నిర్మాతలు ఆమె కోసం క్యూ కట్టడం బట్టి చూస్తుంటే అర్థం అవుతుంది ,రమ్యకృష్ణ క్రేజ్ ఎలాంటిదో.
నాగచైతన్య శైలజరెడ్డి సినిమాలో ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్ కావడంతో సినిమాలో హీరోయిన్కు ఇచ్చేంత తనకు ఇవ్వలని రమ్యకృష్ణ డిమాండ్ చేసిందని సమాచారం.అయితే ఆ క్యారెక్టర్ రమ్యకృష్ణ చేస్తేనే బాగుంటుందని దర్శకుడు మారుతి కోరడంతో నిర్మాత కాదనలేక అంత మొత్తం రమ్యకృష్ణకు ఇవ్వడానికి సిద్ధం అయ్యారని తెలుస్తుంది.దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.