- Advertisement -
ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్టు రమ్యశ్రీ దర్శకురాలిగా మారిన తీసిన చిత్రం ఓ మల్లి. ఈ నెల 15న తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో విడుదల కానుంది. తాను పదో తరగతి చదువుతున్న రోజుల్లో తనకు ఎదురైన ఓ సంఘటన ఆధారంగా ఈ చిత్రాన్ని నిర్మించానని రమ్యశ్రీ చెబుతున్నారు.
అంతేకాదు.. ప్రతి స్త్రీ జీవితంలోనూ ఇలాంటి సంఘటనలు ఉంటాయని చెప్పారు. రమ్యశ్రీ గిరిజన స్త్రీ పాత్రలో కనిపించనున్న ఓ మల్లి చిత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ విడుదలవుతోంది.