Thursday, May 16, 2024
- Advertisement -

మ‌రో సినిమా చేస్తున్న పూరి కొడుకు

- Advertisement -

ద‌ర్శ‌కుడు పూరి జ‌గ‌న్నాథ్ త‌న కొడుకుని ఆకాష్‌ని హీరోగా పెట్టి ‘మెహబూబా’ సినిమా తీశాడు. సినిమా ప‌రంగా ఫెయిల్ అయినప్ప‌టికి ఆకాష్ యాక్టింగ్‌కు మంచి మార్కులే ప‌డ్డాయి. మొద‌టి సినిమా ఫెయిల్ అయినప్ప‌టికి రెండో సినిమాను కూడా కొడుకు ఆకాష్‌తోనే ప్లాన్ చేస్తున్నాడు పూరి. దీనికి సంబంధించి పూరి ఆఫీసులో ఒక కథపై కసరత్తు జరుగుతోందట.

ఈ కథను ఆకాశ్ కోసమే సిద్ధం చేస్తున్నారనేది ఫిల్మ్ నగర్ టాక్. అయితే ఈ సినిమాకి పూరి దర్శకత్వం వహించడం లేదట. ఒక కొత్త కుర్రాడు ఈ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయం కానున్నాడని అంటున్నారు. అయితే ఈ సినిమా పూరి సొంత బ్యానర్లో రూపొందుతుందా? లేదంటే మరో నిర్మాత నిర్మిస్తున్నారా? అనే విషయంలోనే క్లారిటీ రావలసి వుంది. త్వరలోనే ఈ ప్రాజెక్టుకి సంబంధించిన పూర్తి వివరాలు తెలియనున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -