దగ్గుబాటి రానా…ఇప్పుడు ఇండస్ట్రీలో దర్శకులందరి ఛాయిస్గా మారిపోయారు. హీరో,విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఇలా ఏ చిన్న పాత్ర దొరికినా తనకి నచ్చితే ఓకే చెబుతున్నారు. సినిమాలే కాదు వెబ్ సిరీస్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా రానాకు సంబంధించి ఓ ఆసక్తికర వార్త టీ టౌన్లో వైరల్గా మారింది.
భోళా శంకర్ తర్వాత చిరు భారీ అంచనాల మధ్య ఓ ఫాంటసీ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇది చిరు కెరీర్లో 156వ సినిమా కాగా ఇందులో ప్రతినాయకుడిగా రానా నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. సోషియో ఫాంటసి సినిమా కావడంతో తనను సంప్రదించగానే ఓకే చెప్పారట రానా. ఇప్పుడు ఈ వార్త ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది.
ఇక ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్స్ ఉండనున్నట్లు సమాచారం. ప్రముఖ రచయిత సాయి మాధవ్ బుర్రా మాటలు అందిస్తుండగా ఇప్పటికే విడుదలైన పోస్టర్ అందరిని ఆకట్టుకుంది. భూమిని పెకిలించుకుంటూ వస్తున్న త్రిశూలంతో.. చుట్టూ వలయం వంటి పర్వతాలతో పోస్టర్ అదిరిపోయింది. రానా బాహుబలిలో ప్రభాస్కు విలన్గా నటించి మెప్పించారు. తాజాగా చిరుకు విలన్గా నటిస్తుండటం ఇద్దరు హీరోల ఫ్యాన్స్కు గుడ్ న్యూస్ అనే చెప్పాలి.