Friday, April 19, 2024
- Advertisement -

రానాను అలాంటి ప్రశ్న అడిగిన.. హీరోయిన్ రకుల్?

- Advertisement -

తెలుగు ఇండస్ట్రీలో మల్టీ టాలెంటెడ్ హీరో రానా ప్రఖ్యాత సినీ నిర్మాత రామనాయుడి మనవడిగా ఎంట్రీ ఇచ్చినా తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్నాడు. రానా ఓవైపు హీరోగా సత్తా చాటుకుని, మరోవైపు విలన్‌గాను సినీ ప్రేక్షకులను అలరిస్తున్నాడు. లీడర్ మూవీ ద్వారా రానా తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం అయ్యాడు. తర్వాత పాన్ ఇండియా మూవీ బాహుబలి లో ప్రతినాయకుడి పాత్రలో అద్భుతంగా నటించి పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు పొందాడు.

తెలుగు ప్రముఖ ఓటీపీ వేదిక ఆహా’లో ప్రసారమయ్యే ‘NO.1 యారి’ కార్యక్రమం బాగా పాపులర్ అయింది. ప్రముఖ సెలబ్రిటీస్ తో సాగే ఈ ప్రోగ్రాంలో ఆదివారం రాత్రి ప్రసారమైన ఈ కార్యక్రమానికి ప్రముఖ నటులు మంచు లక్ష్మి, రకుల్‌ప్రీత్‌సింగ్‌ హాజరై సందడి చేశారు. ఈ సందర్భంగా హీరోయిన్‌ రకుల్‌ మాట్లాడుతూ మీకు ఒక్కరోజు ప్రధానమంత్రిగా అవకాశం వస్తే చేసే మొదటి పని ఏంటి? అని రానాను ప్రశ్నించింది. రానా స్పందిస్తూ.. విద్య, వైద్యం అందరికీ ఉచితంగా అందేలా చర్యలు తీసుకుంటానని అన్నారు. విద్య, వైద్యం ప్రజలకు సక్రమంగా అందిస్తే దేశం అంతా మారిపోతుందని తాను భావిస్తున్నానని రానా తన మనసులోని మాటను చెప్పుకొచ్చాడు.

Also read:ఈ టాలీవుడ్ హీరోలు అందరూ అలా కష్టపడే పైకి వచ్చారు!

హీరో రానా ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం రానా నటించిన ‘విరాటపర్వం’ చిత్రీకరణ పనులు పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధంగా ఉంది. తర్వాత
పవర్‌ స్టార్ పవన్‌ కల్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్‌లో మల్టీస్టారర్ మూవీ మలయాళం చిత్రం ‘అయ్యప్పనుమ్‌ కోషియమ్‌’ చిత్రం రీమేక్‌ అవుతున్న విషయం తెలిసిందే.రానాను అలాంటి ప్రశ్న అడిగిన.. హీరోయిన్ రకుల్?

Also read:త్రిషకు ఇదే లాస్ట్ బ్యాచిలర్ బర్త్ డే అంటూ.. షాకింగ్ కామెంట్స్ చేసిన నటి!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -