Sunday, May 19, 2024
- Advertisement -

రానా ‘హాథీ మేరీ సాథీ’ కరోనా ఎఫెక్ట్..!

- Advertisement -

గత ఏడాది నుంచి దేశ వ్యాప్తంగా కరోనా సృష్టిస్తున్న బీభత్సం అంతా ఇంతా కాదు. ప్రాణాలు, ఆర్థిక నష్టంతో పాటు ఎంటర్ టైన్ మెంట్, విద్యా వ్యవస్థ పై ఎంతో ఎఫెక్ట్ పడింది. ఇటీవల లాక్ డౌన్ సడలించిన తర్వాత థియేటర్లు మళ్లీ ఓపెన్ చేశారు. దాంతో కొత్త చిత్రాలు థియేటర్లో సందడి చేశాయి. ఇప్పుడు మళ్లీ కరోనా సెకండ్ వేవ్ మొదలు కావడం.. కేసులు పెరిగిపోవడం జరుగుతుంది. దాంతో ప్రస్తుతం తెలంగాణలో విద్యావ్యవస్థలు బంద్ చేశారు.

ఇదిలా ఉంటే త్వరలో మాల్స్, థియేలర్లు, రద్దీగా ఉండే ప్రదేశాలపై కూడా ఆంక్షలు పెట్టబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక రానా హీరోగా తెరకెక్కిన ‘అరణ్య’ మార్చి 26న విడుదల కావాల్సి ఉంది. తమిళంలో ‘కాదన్‌’, హిందీలో ‘హాథీ మేరీ సాథీ’ పేర్లతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. అయితే మహారాష్ట్రలో కరోనా కేసులు బీభత్సంగా పెరిగిపోతున్నాయి.

దాంతో కొన్ని ముఖ్యప్రదేశాల్లో రాత్రి కర్ఫ్యూ, లాక్ డౌన్ కూడా విధిస్తున్నారు. దాంతో  ‘హాథీ మేరీ సాథీ’ విడుదల వాయిదా పడింది. ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ ఎరోస్‌ మంగళవారం వెల్లడించింది. మరిన్ని వివరాలు త్వరలోనే ప్రకటిస్తామని తెలిపింది. ఇక తెలుగులో ‘అరణ్య’, తమిళంలో ‘కాదన్‌’ యథావిధిగా మార్చి 26న విడుదలవుతాయని స్పష్టం చేసింది.

‘హైదరాబాద్ సిస్టర్స్’ గాయని కుమారి లలిత కన్నుమూత!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -