Wednesday, May 1, 2024
- Advertisement -

ఓటీటీలో ప్రసారం కానున్న నితిన్ “రంగ్ దే”… ఎప్పుడంటే?

- Advertisement -

నితిన్ హీరోగా నటించిన చెక్ సినిమా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయినప్పటికీ, తరువాత నితిన్, కీర్తి సురేష్ జంటగా వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన “రంగ్ దే” సినిమా మార్చి 26న థియేటర్లో ప్రేక్షకుల ముందుకు వచ్చి పర్వాలేదనిపించింది. ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, టీజర్లు, సినిమా పై ఎన్నో అంచనాలను క్రియేట్ చేశాయి.

నితిన్, కీర్తి సురేష్ చేసిన ప్రమోషన్‌ వీడియోలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ నేపథ్యంలో సాగిన ఈ చిత్రం పాజిటివ్‌ టాక్‌ వచ్చింది. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా సాగిన ఈ చిత్రం త్వరలోనే ఓటీటీలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
ఈ క్రమంలోనే జూన్ 12న నితిన్ రంగ్ దే జీ5లో స్ట్రీమింగ్ కానుంది.

Also read:అరియనా వాట్సాప్ డీపీ, వాల్ పేపర్ చూస్తే.. షాక్ అవ్వాల్సిందే!

ఈ సినిమా ఓటీటీ విడుదల సందర్భంగా దీనికి సంబంధించి జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. థియేటర్లో విడుదల పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా ఓటీటీలో ఎలాంటి ఫలితాలను అందుకుంటుందో వేచి చూడాల్సిందే. ఇకపోతే నితిన్ బాలీవుడ్ చిత్రం “అంధాధున్” చిత్రాన్ని తెలుగులో మాస్ట్రో టైటిల్ తో రీమేక్ చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఈ రీమేక్‌ను నితిన్ త‌న సొంత బ్యాన‌ర్ శ్రేష్ఠ్ మూవీస్‌లో నిర్మిస్తున్నారు.

Also read;అక్కడ అసభ్యకరంగా తాకాడు.. చచ్చేలా కొట్టా: నవ్య స్వామి

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -