Friday, May 3, 2024
- Advertisement -

రంగ‌స్థ‌లంకు పార్టీ ఇవ్వ‌నున్న రాంచ‌ర‌ణ్‌

- Advertisement -

రాంచ‌ర‌ణ్ తాజా చిత్రం రంగ‌స్థ‌లం రికార్డులు సృష్టించుకుంటు దూసుకుపోతోంది.ఈసినిమా రెండ‌వ వారంలో కూడా మంచి క‌లెక్ష‌న్స్‌ని సాధించ‌డంతో చిత్ర యూనిట్ మంచి జోష్‌లో ఉంది.దాదాపు అన్ని ఏరియాల్లోనూ హౌస్ ఫుల్స్ సాధించిన‌ రామ్ చరణ్ మూవీ, ఇప్పటికే టాలీవుడ్ టాప్ హిట్స్ లో ఒక‌టిగా నిలిచింది. ఇప్పుడు ఆ సినిమా స‌క్సెస్‌ని పురస్కరించుకుని ఈ వారంలో ఓ గ్రాండ్ పార్టీ ఇవ్వాలని చరణ్ అండ్ టీం నిర్ణయించుకున్నారు.. అస‌లే చాలాకాలం త‌రువాత మెగా ఫ్యాన్స్ హిట్ ఇచ్చిన మెగా పవర్ స్టార్ మూవీ సక్సెస్ ను రంగస్థలం టీంతో పాటు మెగా అభిమానులతో కలిపి సెలబ్రేట్ చేసుకోవాలని నిర్ణయించారు.

ఈ ఫంక్ష‌న్‌కు చిత్ర యూనిట్‌తో పాటు అభిమానుల‌ను కొంత‌మందిని సెలెక్ట్ చేసి పిలవ‌ల‌ని భావిస్తున్నార‌ని తెలుస్తుంది.అలాగే సినిమా డిస్ట్రిబ్యూటర్లను కూడా ప్రత్యేకంగా ఆహ్వానించనున్నారట.ఈ ఫంక్ష‌న్‌కు మెగాస్టార్ చిరంజీవి కూడా వ‌స్తున్నార‌ని స‌మాచారం.అస‌లు ఈ పార్టీ ఐడియా రాంచ‌ర‌ణ్‌ది కాద‌ని ఆయ‌న భార్య ఉపాస‌న‌దని తెలుస్తుంది. రాంచ‌ర‌ణ్ చాలాకాలం తుర‌వాత హిట్ కొట్ట‌డంతో ఇలా ఫంక్ష‌న్ చెద్దాం అని ఐడియా ఇచ్చింది ఉపాస‌న‌నేన‌ట‌. భార్య ఇచ్చిన ఐడియాను అచ‌ర‌ణ‌లో పెడుతున్నాడు రాంచ‌ర‌ణ్‌.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -