Monday, May 13, 2024
- Advertisement -

సీనియ‌ర్ న‌టుడి భార్య మృతి.. విషాదంలో రావు ర‌మేశ్‌

- Advertisement -

మ‌నిషికి కాసింత క‌లా పోష‌ణ ఉండాలోయ్ అంటూ… ఓసొసి అంటూ విల‌క్ష‌ణ‌మైన న‌ట‌న‌, డైలాగ్స్‌తో 1980-90 మ‌ధ్య సినిమాల్లో ఆక‌ట్టుకున్న న‌టుడు రావుగోపాలరావు. ప్ర‌స్తుతం ఆయ‌న భార్య కమలకుమారి (73) మృతిచెందారు. క‌మ‌ల‌కుమారి రావుగోపాల రావు భార్య‌గానే కాకుండా ప్రముఖ హరికథా కళాకారిణిగా పేరు పొందారు. అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న ఆమె శ‌నివారం తెల్లవారుజామున కొండాపూర్‌లోని స్వ‌గృహంలో మ‌ర‌ణించారు. రావుగోపాల రావు, క‌మ‌ల‌కుమారి దంప‌తుల‌కు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. పెద్ద కుమారుడు రావు రమేశ్ ప్రస్తుతం తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లో సహాయ నటుడిగా కొనసాగుతున్నారు.

ఎన్నో వేదికలపై హరికథా గానం చేసిన క‌మ‌ల‌కుమారి గోపాల్‌ రావును ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కమలకుమారి హ‌రిక‌థా గానం చేస్తుండ‌గా ఓ షోలో చూసిన రావుగోపాలరావు ఆమెను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఈ విష‌యం తెలుసుకున్న మెగాస్టార్ చిరంజీవి క‌మ‌ల‌కుమారికి నివాళుల‌ర్పించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -