జబర్దస్త్ షో ద్వారా సుడిగాలి సుధీర్ బాగా హైలైట్ అయ్యాడు. కొన్ని సీనిమాల్లో కమెడీయన్ గా కూడా చేశాడు. ఇప్పుడు హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. సుధీర్ హీరోగా నటించిన చిత్రం “సాఫ్ట్వేర్ సుధీర్”. ఈ చిత్రంలో సుధీర్ సరసన రాజుగారిగది ఫేమ్ ధన్యా బాలకృష్ణన్ నటిస్తోంది.
అయితే ఈ చిత్రంలో హీరోయిన్ గా రష్మీని అనుకున్నారట దర్శక నిర్మాతలు. రష్మీ, సుధీర్ కు ఉన్న క్రేజ్ వల్ల సినిమాకి బాగా హైప్ వస్తుందని భావీంచి రష్మీ గౌతమ్ ను దర్శక నిర్మాతలు సంప్రదించారట. కానీ డేట్స్ సర్దుబాటు కారణంగా ఈ సినిమా నుంచి రష్మీ తప్పుకుందట. దాంతో హీరోయిన్ గా ధన్యా బాలకృష్ణను తీసుకున్నారు. ఈ విషయంను సాఫ్ట్వేర్ సుధీర్ సినిమా ప్రమోషన్స్లో భాగంగా సుడిగాలి సుధీర్ చెప్పారు.
కాగా, రాజశేఖర్ రెడ్డి పులిచర్లని దర్శకుడిగా,శేఖర ఆర్ట్స్ క్రియేషన్స్ పతాకంపై పారిశ్రామికవేత్త కె.శేఖర్ రాజు ఈ సినిమాను నిర్మించారు. డిసెంబర్ మొదటివారంలో సినిమా విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. సాఫ్ట్వేర్ నేపథ్యంలో కామెడీగా సాగే కమర్షియల్ చిత్రమిది అని రాజశేఖర్ రెడ్డి తెలిపారు.