Saturday, May 11, 2024
- Advertisement -

రష్మీక ని బ్యాన్ చేయాలి అంటున్న అభిమానులు

- Advertisement -

‘ఛలో’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన కన్నడ బ్యూటీ రష్మిక మందన్న ‘గీత గోవిందం’ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకుంది. తాజాగా ఇప్పుడు ‘డియర్ కామ్రేడ్’ అనే సినిమా తో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఈ సినిమా సౌత్ ఇండియా లోని నాలుగు బాషల్లోనూ విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న రష్మిక మందన్న ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చేసిన ఒక కామెంట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కర్ణాటక లో పుట్టి పెరిగింది కాబట్టి, రష్మిక మందన్న ని ‘డియర్ కామ్రేడ్’ సినిమాలో తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకొని ఉండొచ్చు కదా అని ఇంటర్వ్యూలో అడిగారు.

దానికి రష్మిక మందన్న తనకి అది చాలా కష్టమని ఎందుకంటే తను అంత బాగా కన్నడ మాట్లాడలేనని చెప్పుకొచ్చింది రష్మిక. కర్ణాటక లో పుట్టి పెరిగినప్పటికీ కన్నడ రాదు అని చెప్పటం అభిమానులను కూడా షాక్ కి గురి చేసింది. ఈ నేపథ్యంలో కొందరు ఏకంగా కన్నడ ఫిలిం కౌన్సిల్లో రష్మిక మందన్న ని బ్యాన్ చేయాలంటూ డిమాండ్ చేయడం మొదలుపెట్టారు. మరోవైపు సీనియర్ కన్నడ నటుడు జగ్గేష్ కూడా రష్మిక మందన్న ఈరోజు ఈ స్థానంలో ఉండటానికి కారణం కన్నడ ప్రేక్షకులని అలాంటిది తాను ఇలాంటి కామెంట్లు చేయడం బాలేదని అన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -