Sunday, April 28, 2024
- Advertisement -

రూమర్స్ కు కౌంటర్ ఇచ్చిన రష్మిక మందన్న

- Advertisement -

గత కొన్ని రోజులుగా నెట్టింట వస్తున్న రూమర్స్ కు రష్మిక మందన్న ఓ లేక రూపంలో స్పందించారు. ఈ మధ్యకాలంలో రష్మిక మందన్న, ఆమె మేనేజర్ విడిపోయిన విషయం తెలిసిందే. మరో పక్క రష్మిక మందన్నా తన మేనేజర్‌తో ఇక కలిసి పనిచేయడం లేదనే విషయంపై మీడియాలో పలు కథనాలు వస్తున్నాయి.

రష్మికకు తెలియకుండా రూ. 80 లక్షలు మాయం చేశాడని, దీంతో అతన్ని సస్పెండ్ చేసినట్లు వార్తలు వినిపించాయి. ఈ విషయాన్ని పెద్దది చేయకుండా సైలెంట్‌గా రష్మిక ఉందన్న రూమర్స్ గత రెండు రోజులుగా హల్ చల్ చేశాయి. అయితే ఈ విషయంలో తాజాగా రష్మిక, ఆమె మేనేజర్ క్లారిటీ ఇచ్చారు.

మా మధ్య ఎలాంటి ప్రతికూలత లేదు. మేము స్నేహపూర్వకంగా విడిపోవాలని నిర్ణయించుకున్నాము. ఎలా విడిపోతున్నామన్న పుకార్లలో నిజం లేదు. మేము ఇకపై స్వతంత్రంగా పని చేయాలని నిర్ణయించుకున్నాము అని రష్మిక, ఆమె మేనేజర్ ఒక అధికారిక లేఖ ద్వార ప్రకటించి రూమర్స్ కు చెక్ పెట్టారు.

నేషనల్ క్రష్ అని ముద్దుగా పిలుచుకునే రష్మిక మందన్న ఇటీవల యానిమల్ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. బాలీవుడ్ స్టార్ నటుడు రణబీర్ కపూర్ హీరోగా, రష్మిక హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో అనిల్ కపూర్, బాబీ డియోల్ కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం ఆగస్ట్ 11, 2023న విడుదల కానుంది.

Also Read: పూజా హెగ్డేకి మరో పెద్ద షాక్..

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -