Sunday, April 28, 2024
- Advertisement -

పూజా హెగ్డేకి మరో పెద్ద షాక్..

- Advertisement -

టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ లో వరస వైఫల్యాల తర్వాత పూజా హెగ్డేకి డిమాండ్ తగ్గినట్లు కనిపిస్తోంది. ఒకప్పుడు నెం. 1 హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన పూజా హెగ్డే అనేక భారీ బడ్జెట్ ప్రాజెక్ట్‌లలో అవకాశం దక్కించుకుంది. ప్రస్తుతం స్టార్ హీరోలలో డిమాండ్ ఉన్న శ్రీలీల, రష్మిక వంటి వారికి దక్కుతున్నాయి.

ఒకప్పుడు అల వైకుంఠపురములో, మహర్షి మరియు అరవింద సమేత వంటి సినిమాల్లో నటించిన పూజాకు దర్శకులు త్రివిక్రమ్, హరీష్ శంకర్ నిరంతరం ఆఫర్లతో అండగా నిలిచారు. త్రివిక్రమ్ ఆమెకు అల వైకుంఠపురములో, అరవింద సమేత మరియు గుంటూరు కారం ఆఫర్ చేయగా, హరీష్ శంకర్ తన DJ, గద్దలకొండ గణేష్ మరియు రాబోయే చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్ వంటి ప్రాజెక్ట్‌లలో అవకాశాన్ని కల్పించారు.

అయితే ఇప్పుడు అంత తారుమారైనట్టు తెలుస్తుంది. మెన్నటికి మెన్న త్రివిక్రమ్ దర్శకత్వంలో వస్తున్న మహేష బాబు సినిమా గుంటూరు కారం లో ప్రధాన కథానాయికగా ఎంపిక చేశారు, కానీ ఇప్పుడు ఆమెను సినిమా నుండి తొలగించి శ్రీ లీలని ప్రధాన కథానాయికగా ఎంచుకుంది చిత్ర బృందం. మరో పక్క హరీష్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ నుండి కూడా తొలగించి నట్టు సమాచారం అందుతుంది.

Also Read: ప్రభాస్ సాలార్‌ సినిమా స్టోరీ లైన్ ఇదేనా..?

పూజా హెగ్డే నటించిన బాలీవుడ్ కిసీ కా భాయ్ కిసీ కి జాన్, సర్కస్ టాలీవుడ్‍లో ఆచార్య, రాధే శ్యామ్, కోలీవుడ్‌లో మృగం సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్స్ గా నిలిచాయి. వరస పరాజయాలతో సతమతమవుతున్న పూజా హెగ్డేకి పెద్ద దెబ్బగా మారాయి.

Also Read: RX100 దర్శకుడితో నాగార్జున…

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -