నటించిన తొలి సినిమాలోని హీరోతోనే ప్రేమాయణం కొనసాగి పెళ్లి చేసుకున్న జంట అక్కినేన నాగచైతన్య, సమంత. వీరిద్దరి మాదిరిగా మరోజంట కానుంది. అయితే ఆ జంట తెలుగు సినీ పరిశమ్రకు సబంధం ఉన్నవారే. వారే కన్నడ హీరో రక్షిత్ శెట్టితో హీరోయిన్ రష్మిక మండన్నా. వారెవరో తెలుసుకోండి.. కన్నడలో ‘కిరిక్ పార్టీ’ అనే సూపర్ హిట్ సినిమా వచ్చింది. ఈ సినిమాలో హీరోగా రక్షిత్ శెట్టి.. హీరోయిన్గా రష్మిక మండన్నా నటించింది. రష్మికకు అదే తొలి సినిమానే.
ఈ సినిమా షూటింగ్ సమయంలో రక్షిత్, రష్మిక ఇద్దరి మధ్య ఏర్పడిన స్నేహాం ప్రేమకు దారితీసింది. వీరిద్దరూ ప్రేమాయణంలో మునిగితేలుతున్నారు. ప్రస్తుతం రష్మిక నాగశౌర్య నటించిన చిత్రం ‘చలో’ సినిమాలో చేస్తోంది. ఆమె నటించిన తొలి తెలుగు సినిమా ఇది. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడింది. తన వ్యక్తిగత విషయాలు పంచుకుంది.
తన ప్రియుడు, కన్నడ హీరో రక్షిత్ శెట్టి గురించి మాట్లాడారు. ‘కిరిక్ పార్టీ’ సినిమా సమయంలో రక్షిత్తో నాకు స్నేహం ఏర్పడింది. అనంతరం మా ఇద్దరి మనసులు కలిశాయి. పెద్దలతో మాట్లాడి, పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నా. అతడు మంచి రచయిత అని తెలిపారు. పెద్దలతో మాట్లాడి కుటుంబసభ్యులతో మాట్లాడి ప్రేమ పెళ్లి చేసుకుంటామని ప్రకటించారు.