Friday, May 17, 2024
- Advertisement -

తను లక్కీ కాదు అంటున్న రష్మిక మందన్న

- Advertisement -

‘ఛలో’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన కన్నడ బ్యూటీ రష్మిక మందన్న మొదటి సినిమాతోనే మంచి హిట్ ను అందుకుంది. ఇక తన రెండవ సినిమా ‘గీతగోవిందం’ బ్లాక్ బస్టర్ అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం తన తదుపరి సినిమా ‘డియర్ కామ్రేడ్’ పై కూడా మంచి అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం మహేష్ బాబు హీరోగా నటిస్తున్న ‘సరిలేరు నీకెవ్వరు’ లో కూడా ఈమె హీరోయిన్ గా కనిపించనుంది. ఇప్పటిదాకా తెలుగులో సక్సెస్ మాత్రమే చూసిన ఈమె ని ఎవరైనా లక్కీ అంటే తనకి అస్సలు నచ్చడంలేదట.

‘డియర్ కామ్రేడ్’ సినిమాలో కేవలం పది నిమిషాల సీన్ కోసం తాను నాలుగు నెలలపాటు కష్టపడి క్రికెట్ ట్రైనింగ్ తీసుకున్నానని, తన భాష కాకపోయినా సొంతంగా డబ్బింగ్ కూడా చెప్పగలుగుతున్నాను అని, తనకి తన ట్యాలెంట్ వల్ల వరుసగా అవకాశాలు వస్తున్నాయి కానీ అదృష్టం వల్ల కాదని గట్టిగా చెప్పుకొచ్చింది రష్మిక. తన తదుపరి సినిమా గురించి మాట్లాడుతూ ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలో తన పాత్ర షూటింగ్ ఇంకా పూర్తి కాలేదని చెప్పిన రష్మిక అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా లో కూడా హీరోయిన్గా నటిస్తున్నట్లు తెలిపింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -