క్రాక్ హిట్తో మాంచి ఊపుమీద ఉన్నాడు మాస్ మహారాజా రవితేజ. సుదీర్ఘ నిరీక్షణ అనంతరం రవితేజకు ఈ హిట్ దొరికింది. దీంతో ఆ సారి కథల విషయంలో ఎంతో జాగ్రత్త వహించి విభిన్నమైన చిత్రాలను ఎంపిక చేసుకుంటున్నాడు రవితేజ. ప్రస్తుతం ఖిలాడీ అనే ఓ ప్రతిష్ఠాత్మక యాక్షన్ మూవీలో నటిస్తున్నాడు ఆయన. రాక్షసుడు వంటి సస్పెన్స్ థ్రిల్లర్ను తెరకెక్కించిన ప్రశాంత్ వర్మ ఖిలాడీకి దర్శకత్వం వహిస్తున్నాడు. గతంలో వీరిద్దరి కాంబోలో వచ్చిన వీర మూవీ పెద్దగా ఆడలేదు. అయినప్పటికీ మళ్లీ చాన్స్ ఇచ్చాడు రవితేజ.
ఈ సినిమాలో కొన్ని యాక్షన్ సన్నివేశాలు హాలీవుడ్ సినిమాలను తలపిస్తాయట. క్లైమాక్స్లో ఫైట్ సీన్ను ఇప్పటికే ఇటలీలో చిత్రీకరించారు. ఈ యాక్షన్ ఎపిసోడ్ ను అన్బు – అరివు డిజైన్ చేశారు. ఈ యాక్షన్ ఎపిసోడ్ ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తుందని అంటున్నారు.అన్బు – అరివుతో పాటు, రామ్ – లక్ష్మణ్ కూడా ఈ సినిమాకి పనిచేస్తున్నారు.
Also Read: రవితేజ రెమ్యునరేషన్ పెంచేశాడా?
కోనేరు సత్యనారాయణ నిర్మిస్తున్న ఈ సినిమాను, త్వరలోనే విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు. మీనాక్షి చౌదరి డింపుల్ హయతి హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నారు. అయితే ఈ సినిమాకు బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా హైలెట్ అయ్యే అవకాశం ఉందని యూనిట్ సభ్యులు చెబుతున్నారు. ఇక రవితేజ ఫ్యాన్స్ ఈ మూవీ కోసం ఎదురుచూస్తున్నారు.