- చాలెంజ్ చాలెంజ్ అంటూ చేస్తే ఫ్లాపులే
- నేనింతే అంటున్న రవితేజ
“చాలెంజింగ్ రోల్స్ ఎందురు చేయాలి. కొత్తదనంతో చేస్తుంటే సినిమాలు పోతున్నాయి. నేను బ్రహ్మాండమైన సినిమాలు చేశా“ అని మాస్ మహారాజ రవితేజ మండిపడుతున్నారు. అలా చేసిన సినిమాలన్నీ కమర్షియల్గా ఆడలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. శంభో శివ శంభో, నేనింతే సినిమాలు ఏమయ్యాయో చూశారుగా. నా ఆటోగ్రాఫ్, ఈ అబ్బాయి చాలా మంచోడు సినిమాలు ఎంత మంచి సినిమాలో మీకు తెలుసు. కానీ పోయాయి. చాలెంజ్ చాలెంజ్ అంటూ పోతే ఇలానే ఉంటుంది అని విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
తన అట్టర్ ఫ్లాప్ సినిమాలపై రవితేజ మీడియా ఎదుట ఇలా వాపోయారు. ఎప్పుడూ ఒకే తరహా పాత్రల్లో కనిపిస్తున్నారు ఏంటి? అని మీడియా వేసిన ప్రశ్నకు రవితేజ ఇచ్చిన సమాధానం అది. ప్రయోగాత్వక సినిమాలు ఎందుకు చేయాలని ఎదురు ప్రశ్నించాడు. ఒకవేళ ప్రయోగాలు చేస్తే ఫలితం ఎలా ఉంటుందో పై సమాధానంతో చెప్పారు.
“జనాలకు ఏదిష్టమో అదే ఇవ్వాలి. నా నుంచి వాళ్లు ఫన్ ఆశిస్తున్నారు. క్యారెక్టర్స్ రిపీట్ అవుతున్నాయంటే అవుతాయి మరి. హ్యూమర్ చాలా ఇంపార్టెంట్ నాకు. అది లేకపోతే సినిమా చేయను. చేసినా అవి ఆడవు. “ప్రస్తుతం రవితేజ విక్రమ్ రవితేజ దర్శకత్వంలో టచ్ చేసి చూడు సినిమాలో నటిస్తున్నాడు. రాశీఖన్నా, సీరత్ కపూర్ హీరోయిన్లుగా చేస్తున్నారు. ప్రీతమ్ చక్రవర్తి సంగీతం అందించాడు. ఈ సినిమా ఫిబ్రవరి 2వ తేదీన విడుదలవుతోంది.