Tuesday, May 21, 2024
- Advertisement -

పవన్ అభిమానులకు రేణూదేశాయ్ తో తలనొప్పి..!

- Advertisement -

పవన్ కల్యాణ్ అభిమానులను రేణూదేశాయ్ చాలా ఇబ్బంది పెట్టేస్తోంది. తమ అభిమాన హీరో కు మాజీ భార్య అయిన ఆమె తీరుతో వారు కొన్ని విషయాల్లో ఇబ్బంది పడుతున్నారు. ఆమె ట్వీట్ చేసే విషయాలు వారిని ఇబ్బంది పెడుతున్నాయి.

తమ వైవాహిక జీవితం గురించి ఇది వరకూ పలు ట్వీట్లను చేసింది రేణూ. మొగుడు వదిలేసిన భార్యగా రేణూ చేసే ట్వీట్లు చాలా మందిలో ఆమెపై సానుభూతిని కల్పిస్తాయి. పవన్ ను విలన్ గా చూపుతాయి ఆ ట్వీట్లు.

ఇరువురి సమ్మతితో విడిపోయినప్పటికీ సానుభూతి మాత్రం రేణూ మీదనే నిలుస్తుంది. అందులోనూ ఆమె కొన్ని సార్లు జాలిగొలిపేలా ట్వీట్లు పెడుతుంటుంది. ఆ ట్వీట్లు మీడియాలో న్యూస్ లు అయిపోతుంటాయి. మరి ఆ సంగతి అలా ఉంటే.. ఇప్పుడు తన తనయుడి ఫోటోను ఆమె ట్వీట్ చేయడం ఆసక్తికరగా ఉంది. ప్రిన్స్ మహేశ్ బాబు పక్కన ఆకీరా తీయించుకొన్న ఫోటోను ఆమె ట్వీట్ చేసింది. 

మరి పవన్ కల్యాన్ తనయుడు ఇలా ఒక హీరో పక్కన ఫోటోలు తీసుకొని మురిసిపోవడాన్ని పవన్ అభిమానులు సహించలేకపోవచ్చు. ఇది వారికి తక్కువ తనం అనిపించవచ్చు. అయితే రేణూ మాత్రం అదేమీ పట్టకుండా ట్వీట్ చేసింది. అసలే మహేశ్ బాబును రైవలరీగా చూసే పవన్ అభిమానులు కూడా ఉన్నారు. అలాంటి వారికి రేణు తీరు కచ్చితంగా అసహనాన్ని కలిగించేదే కదా! 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -