Sunday, May 19, 2024
- Advertisement -

గర్ల్స్ హాస్టల్ రాంగోపాల్ వ‌ర్మ హ‌ల్‌చ‌ల్‌…

- Advertisement -

వ‌ర్మ సినిమాలు ఎంత డిఫ‌రెంట్‌గా ఉంటాయో అంతే వివాదాలు ఉంటాయి. వ‌ర్మ సినిమా తీసిన ప్ర‌తీసారి వివాదంతోనె ప‌బ్లిసిటీ తెచ్చుకుంటారు. ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా ఏపీలో విడుద‌ల కాకుండా ఎన్ని వివాదాలు సృష్టించిందో అంద‌రికి తెలిసిందే. కొత్త ప్ర‌భుత్వం రావ‌డంతో సినిమా రిలీజ్ కు అడ్డంకులు తొల‌గిపోయాయి.

త్వ‌ర‌లో సినిమా రిలీజ్ సంద‌ర్భంగా ప్రెస్ మీట్ ను నిర్వహించేందుకు విజయవాడ వెళ్లిన వర్మ… తన పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. గ‌తంలో తాను ఇంజనీరింగ్ చ‌దివిన సిద్దార్ధ ఇంజ‌నీరింగ్ కాలేజీనీ సినీ దర్శకుడు రాంగోపాల్ వర్శ సందర్శించారు. కాలేజీ పరిసరాల్లో తిరుగుతూ గ‌త‌స్మృతులను నెమ‌రువేసుకున్నారు.

కాలేజీ రోజుల్లో తాను ఉన్న‌ హాస్టల్ గదిని సందర్శించారు. తాను చ‌దివే రోజుల్లో అది బాయిస్ హాస్ట‌ల్‌గా ఉండేద‌ని ఇప్పుడది లేడీస్ హాస్ట‌ల్ అయ్యింద‌న్నారు.అంతే కాకుండా ఆ గదిలో ఉంటున్న విద్యార్థినులతో ఫొటో తీసుకుని సోషల్ మీడియాలో షేర్ చేశారు. గోడకు శ్రీదేవి బొమ్మలను అతికించిన గోడను చూసుకొని మురిసిపోయారు. హాస్టల్ లో చదువుకునే విద్యార్థినులు వర్మతో సెల్ఫీలు దిగేందుకు పోటీ పడ్డారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -