Monday, April 29, 2024
- Advertisement -

చిరుపై వర్మ మార్క్ సెటైర్..

- Advertisement -

మెగాస్టార్ చిరంజీవిని కేంద్ర ప్రభుత్వం దేశంలోని రెండవ అత్యున్నత పురస్కారం పద్మ విభూషణ్‌తో సత్కరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చిరుకి సినీ, రాజకీయ రంగాలకు అతీతంగా అంతా ప్రశంసలు గుప్పిస్తున్నారు. అయితే మెగా ఫ్యామిలీ అంటే పడని రామ్‌గోపాల్ వర్మ తనదైన శైలీలో స్పందించారు.

పద్మ సుబ్రహ్మణ్యం, బిందేశ్వర్ పాథక్ వంటి వాళ్ల గురించి తాను ఎప్పుడూ వినలేదని… వాళ్లు మెగాస్టార్ చిరంజీవితో సమానంగా నిలవడం తనకు థ్రిల్ కలిగించలేదని చెప్పుకొచ్చారు. ఒకవేళ చిరంజీవి ఈ విషయంలో సంతోషంగా ఉంటే… తాను కూడా సంతోషంగా ఉన్నట్టు నటిస్తానని సెటైర్ వేశారు ఆర్జీవీ.

దీంతో నెటిజన్లు తమదైన శైలీలో స్పందిస్తున్నారు నెటిజన్లు. ఇకనైనా మారవా అంటూ ఆర్జీవీకి చురకలు అంటిస్తున్నారు. చిరుతో పాటు మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడికి కేంద్రం పద్మ విభూషణ్ ప్రకటించిన సంగతి తెలిసిందే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -