Wednesday, May 15, 2024
- Advertisement -

మహేశ్ బాబు సినిమాను చూడటానికి టైమిచ్చిన సచిన్..!

- Advertisement -

‘శ్రీమంతుడు” కేవలం సినిమాగానే కాకుండా సందేశంతో కూడా అందరినీ కట్టిపడేస్తోంది. కేవలం సినీ అభిమానులను, మహేశ్ బాబు ఫ్యాన్స్ ను మాత్రమే కాకుండా అనేక రంగాల ప్రముఖులను కూడా ఈ సినిమా ఆకట్టుకొంటోంది.

మరి ఈ జాబితాలో చేరిపోబోతున్నాడు సచిన్ టెండుల్కర్. అతి త్వరలోనే ఈ సినిమాను చూడబోతున్నాడు సచిన్. క్రికెట్ నుంచి రిటైరైన అనంతరం బిజీబిజీగా ఉన్నా కూడా టెండూల్కర్ శ్రీమంతుడు చూడటానికి కొంత సమయం ఇచ్చాడట. వచ్చే వారంలో ఆయన ఈ సినిమాను చూడబోతున్నట్టుగా సమాచారం.

శ్రీమంతుడు కాన్సెప్ట్ ఏమిటో.. అతి సచిన్ కు ఏ విధంగా రీచ్ అవుతుందో వేరే చెప్పనక్కర్లేదు. ఇప్పటికే టెండూల్కర్ నెల్లూరు జిల్లాలోని ఒక గ్రామాన్ని దత్తత తీసుకొన్నాడు. అక్కడి కలెక్టర్ విజ్ఞప్తి మేరకు టెండుల్కర్ మంచి మనసుతో ఆ గ్రామాన్ని దత్తత తీసుకొని అభివృద్ధి పరుస్తున్నాడు. ఈ విధంగా చూస్తే సచిన్ నిజ జీవితంలోని ఒక శ్రీమంతుడు. కాబట్టి ఈ సినిమాను టెండుల్కర్ కు చూపించాలని శ్రీమంతుడు యూనిట్ భావిస్తోంది.

ఈ మేరకు ఆయనను సంప్రదించగా.. టెండుల్కర్ కూడా సినిమాను చూడటానికి ఆసక్తి ని ప్రదర్శించారని సమాచారం. టెండుల్కర్ వీక్షణ కోసం అన్ని ఏర్పాట్లూ జరిగాయని.. వీలును బట్టి ఆయన వచ్చే వారంలో ఈ సినిమాను చూసే అవకాశాలున్నాయని తెలుస్తోంది. మరి ఇది మహేశ్ బాబు సినిమాకు సాధించిన కొత్త అచీవ్ మెంట్ అని చెప్పాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -