Sunday, May 12, 2024
- Advertisement -

సాయి ధరంతేజ్ మారుతి సినిమా టైటిల్ ఇదేనా?

- Advertisement -

వరుస ప్లాపులతో సతమతమైన మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ ఈ మధ్యనే ‘చిత్రలహరి’ అనే సినిమాతో మంచి హిట్ ను అందుకున్నాడు. కిషోర్ తిరుమల దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది. అదే జోరుతో సాయిధరమ్తేజ్ ఇప్పుడు తన తదుపరి సినిమా ని మొదలు పెట్టేందుకు సిద్ధమవుతున్నాడు. ప్రముఖ దర్శకుడు మారుతి ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు. గీత ఆర్ట్స్ పతాకంపై న అల్లు అరవింద్ ఈ మెగా హీరో సినిమాని స్వయంగా నిర్మించనున్నారు. తాజాగా ఈ సినిమా కి ఒక ఆసక్తికరమైన టైటిల్ ను అనుకుంటున్నట్లు తెలుస్తోంది.

ఈ సినిమా కోసం ‘భోగి’ అనే టైటిల్ ను ఖరారు చేసే ప్లాన్స్ లో దర్శక నిర్మాతలు ఉన్నారట. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన మాత్రం ఇంకా వెలువడాల్సి ఉంది. సినిమాలో హీరోయిన్ పాత్రకోసం రెజీనా కసాండ్రా ను సంప్రదించాలని సంప్రదించనున్నారని తెలుస్తోంది. ఇప్పటికే సాయిధరమ్ తేజ్ మరియు రెజీనా ‘పిల్ల నువ్వు లేని జీవితం’, ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ వంటి హిట్ సినిమాల్లో కలిసి నటించారు. మరి ఈ సినిమాలో వారిద్దరి కెమిస్ట్రీ ఎంతవరకు వర్కవుట్ అవుతుందో వేచి చూడాల్సి ఉంది. టైటిల్ కి తగ్గట్టుగానే ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల కాబోతోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -