Sunday, May 5, 2024
- Advertisement -

తేజ్‌ క‌లెక్ష‌న్స్ మ‌రి దారుణంగా ఉన్నాయిగా…!

- Advertisement -

మెగా మేన‌ల్లుడు సాయి ధర‌మ్ తేజ్ గ‌త కొంత‌కాలంగా స‌రైన హిట్లు లేక ఇబ్బంది ప‌డుతున్న సంగ‌తి తెలిసిందే. మాస్ క‌థ‌ల‌ను ఎంచుకుని చేతులు కాల్చుకున్న సాయి ధర‌మ్ తేజ్,ఈసారి ప్రేమ క‌థ‌తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు. కరుణాకరన్ దర్శకత్వంలో సాయి ధరమ్ తేజ్ ,అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన చిత్రం ‘తేజ్ ఐ లవ్ యు’.ఈ చిత్రం గ‌త శుక్ర‌వారం విడుద‌లైంది. ఈ చిత్రంపై ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందన లభిస్తుంది.

కరుణాకరన్ మ్యాజిక్ వర్క్ అవుట్ కాకపోవడంతో పాటు ఈ చిత్రం ప్రేక్షకులను నిరాశకు గురిచేసింది . మొదటి రెండు రోజుల‌కుగాను ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో కేవలం 3.44 కోట్ల షేరును మాత్రమే రాబట్టుకోగలిగింది. ఇక వరుస పరాజయాలతో కొనసాగుతున్న తేజు కు ఈ చిత్రం కూడా నిరాశనే మిగిల్చింది. తేజు ఇక‌నైన క‌థ‌ల‌ను న‌మ్ముకుని సినిమాలు చేస్తే బాగుంటుంద‌ని మెగా ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. ఈ సినిమాతో పాటే రిలీజ్ అయిన గోపిచంద్ మూవీ పంతం హిట్ టాక్‌తో దూసుకుపోతుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -