Wednesday, May 22, 2024
- Advertisement -

రాజేంద్ర ప్రసాద్ – సాయి ధరం తేజ మధ్య సీన్ లు కేక

- Advertisement -

మెగా స్టార్ చిరంజీవి పేరు నిలుపుతూ దూసుకుపోతున్నాడు హీరో సాయి ధరం తేజ. గోపీ చంద్ మలినేని తో అతని కొత్త సినిమా ప్రారంభం కాబోతోంది. పండగ చేస్కో సినిమాతో పరవాలేదు అనిపించే హిట్ కొట్టిన గోపీ చంద్ సాయి కోసం కొత్త స్క్రిప్ట్ ని రాసాడట. ఈ సినిమా పూర్తిగా ఫాదర్ సెంటిమెంట్ తో నడుస్తుంది అంటున్నారు.

ఫాదర్ సెంటిమెంట్ తో పాటు క్యూట్ లవ్ యాంగిల్, యాక్షన్, కమర్షియల్ ఎలిమెంట్స్ యాడ్ చేసి కథ రెడీ చేస్తున్నారు. ప్రజెంట్ స్క్రిప్ట్ వర్క్ జరుగుతుంది. శ్రీధర్ సీపాన డైలాగులు రాస్తున్నారు. శ్రీధర్ సీపాన స్క్రిప్ట్ వర్క్ లో కూడా కాస్త చేసారు అనీ రాజేంద్ర ప్రసాద్ సాయి కి తండ్రిగా కనిపిస్తారు అని చెబుతున్నారు. సాయి ధరం తేజ –

రాజేంద్ర ప్రసాద్ మధ్యన వచ్చే సీన్ లు  స్క్రిప్ట్ లో చాలా ఎక్సెలెంట్ గా వచ్చాయి అనీ సెంటిమెంట్ పండి తీరుతుంది అనీ యూనిట్ పక్కా కాన్ఫిడెంట్ గా ఉంది. సునీల్ రెడ్డి దర్శకత్వంలో సాయిధరమ్ తేజ్ హీరోగా నటించిన ‘తిక్క’ షూటింగ్ చివరిదశలో ఉంది. ఇది పూర్తయిన తర్వాత గోపిచంద్ మలినేని సినిమా స్టార్ట్ అయ్యే అవకాశాలున్నాయి. ఈలోపు ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేయాలనేది ప్లాన్.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -