Saturday, April 27, 2024
- Advertisement -

ప్రభాస్ కల్కిలో రాజేంద్రప్రసాద్!

- Advertisement -

మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం కల్కి 2898AD.విజువల్ వండర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం మే9న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకురానుంది. రూ.400 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఇప్పటికే ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్,దీపికా పదుకొనే,దిశా పటాని,రానా వంటి నటులు కీలక పాత్ర పోషిస్తుండగా వీరితో పాటు రాజమౌళి, దుల్కర్ సల్మాన్, నాని, విజయ్ దేవరకొండ గెస్ట్ రోల్‌లో కనిపించనున్నారు.

ఇక తాజాగా మరో నటుడు ఎంటర్ అయ్యారు. నటకిరీటి రాజేంద్రప్రసాద్ ఈ సినిమాలో నటించనున్నారు. ఈ విషయాన్ని స్వయంగా రాజేంద్రప్రసాదే వెల్లడించారు.
మహాభారతం నుండి మొదలై కలియుగం 2898లో ముగుస్తుందని, 6000 సంవత్సరాల కథని చూపించబోతున్నట్టు, భవిష్యత్తు, గతం,సైన్స్, పురాణాలు ఇలా అన్ని కలగలిపి తెరకెక్కిస్తున్నారు అశ్విన్.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -