Sunday, May 5, 2024
- Advertisement -

సాయి పల్లవి.. శశికళ లా మారడం లేదట..

- Advertisement -

దక్షిణ భారత సినిమా పరిశ్రమ లో పేరున్న నటుల్లో సాయి పల్లవి ఒకరు. ఆమె ఇప్పటి వరకు ఎన్నో సినిమాలు చేసింది. చేసిన ప్రతి సినిమా లో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పాటు చేసుకుంది. అయితే ప్రస్తుతం మాత్రం వరుస పరాజయాల తో విమర్శకుల నోరు కి పని చెప్తుంది. ఇటీవలే విడుదల అయినా ఎన్జీకె సినిమా ఫెయిల్ అవడం తో ఆవిడ మీద నెగటివిటీ పెరిగింది. అయినప్పటికీ సాయి పల్లవి అవేమి పట్టించుకోకుండా తన పని చేసుకుంటూ పోతుంది.

అయితే తాజా ఫిలిం నగర్ సమాచారం ప్రకారం తమిళం లో రానున్న ఒక క్రేజీ హై బడ్జెట్ సినిమా లో సాయి పల్లవి చేయడం లేదట. గత కొంత కాలం గా విజయ్ దర్శకత్వం వహిస్తున్న తలైవి అనే సినిమా లో సాయి పల్లవి నటిస్తుంది అనే వార్తలు వచ్చాయి. ఈ సినిమా తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత కి సంబందించిన బయోపిక్ అని తెలిసింది. అయితే ఇందులో కంగనా జయలలిత పాత్ర చేస్తూ ఉండగా సాయి పల్లవి శశికళ లా చేస్తుంది అనే టాక్ వచ్చింది. అయితే ఇప్పుడు ఆ టాక్ లో ఎంత మాత్రం నిజం లేదు అని తెలిసిపోయింది. ఆవిడ సన్నిహిత వర్గాలు కూడా ఇదే విషయాన్నీ స్పష్టం చేశారు.

ఇక త్వరలో సాయి పల్లవి రానా తో చేయబోయే సినిమా కి సంబంధించిన షూటింగ్ లో పాల్గొననుంది. వేణు ఉడుగుల ఈ సినిమా కి దర్శకుడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -