Wednesday, May 1, 2024
- Advertisement -

బంపర్ ఆఫర్ కొట్టేసిన సాయిపల్లవి

- Advertisement -

‘బాహుబలి’ సినిమా తరువాత దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ సినిమాపై భారీ అంచనాలు ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అలియాభట్ నటిస్తుండగా ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ బ్యూటీ డైసీ ఎడ్గార్ జోన్స్ నటించాలి. కానీ ఆమె ఉన్నట్టుండి ఈ సినిమా నుంచి తప్పుకోవడంతో ఆమె స్థానంలో మరొక హీరోయిన్ కోసం చిత్ర బృందం వెతుకులాట మొదలు పెట్టింది. ఇప్పటికే పలు హీరోయిన్ల పేర్లు బయటకు వచ్చాయి కానీ ఇంకా అధికారిక ప్రకటన మాత్రం వెలువడలేదు. తాజాగా ఈ జాబితాలో చేరిన మరో భామ మరెవరో కాదు ‘ఫిదా’ బ్యూటీ సాయి పల్లవి.

ఎన్టీఆర్ సరసన హీరోయిన్ పాత్ర కోసం సాయి పల్లవి అయితే బాగుంటుందని రాజమౌళి ఆమెను సంప్రదించ బోతున్నారు అని పుకార్లు బయటకు వస్తున్నాయి. ఇప్పటిదాకా తెలుగులో మీడియం రేంజ్ హీరోలతో నటించిన సాయి పల్లవి కి రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్ వంటి స్టార్లు ఉన్న భారీ బడ్జెట్ సినిమాలో నటించే అవకాశం రావడం బంపర్ ఆఫర్ అని చెప్పుకోవచ్చు. ఏదేమైనా ఇంకా అధికారిక ప్రకటన వచ్చేవరకు ప్రేక్షకులు ఎదురు చూడాల్సి ఉంటుంది. 350 కోట్ల బడ్జెట్ తో డివివి దానయ్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా వచ్చే ఏడాది జూలైలో విడుదల కానుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -