తెలుగు సినిమాలకు మళ్లీ పూర్వవైభవం వస్తుంది.. ప్రస్తుతం అన్ లాక్ ప్రక్రియ కొనసాగడంతో షూటింగ్ లు పునఃప్రారంభం అవుతున్నాయి. అంతే కాదు త్వరలో థియేటర్లు కూడ ఓపెన్ అవబోతున్నట్లు సమాచారం. ఇప్పటి వరకు కరోనా మహమ్మారి కారణంగా థియేటర్లు, మాల్స్ మూసి వేసిన విషయం తెలిసిందే. మార్చి నెల నుంచి షూటింగ్స్ కూడా పూర్తిగా ఆగిపోయాయి. అప్పటికే పూర్తి చేసుకున్న సినిమాలు ఓటీటీలో రిలీజ్ అయ్యాయి.
తాజాగా సంపత్ నంది దర్శకత్వంలో హీరో గోపీచంద్ ‘సీటీమార్’ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు. తమన్నా కథానాయిక. నటి భూమిక ప్రధానపాత్ర పోషిస్తున్నారు. ఇందులో గోపీచంద్, తమన్నా కబడ్డీ కోచ్లుగా కనిపించబోతున్నారు.
‘సీటీమార్’ చిత్రీకరణ నవంబరు 23 నుంచి పునఃప్రారంభం కానుంది. “కూత మొదలు.. నవంబరు 23 నుంచి ఇక నాన్స్టాప్” అని దర్శకుడు సంపత్ నంది ట్వీట్ చేశారు. ఈ చిత్రాన్ని మణిశర్మ సంగీతాన్ని అందిస్తున్నారు.
వర్మ కు మరో షాక్.. దిశ మూవీపై వివరణ ఇవ్వాలి
మహేశ్ బాబు కొత్త హెయిర్ స్టయిల్ తో న్యూ లుక్..!