Friday, March 29, 2024
- Advertisement -

పాపం సమంత ఇక బుల్లితెర‌పైకి

- Advertisement -

మొన్న‌టి వ‌రుకు స‌మంత అంటే ఆ క్రేజ్ వేరు కాని ఒక్కసారి పెళ్లి అయిన త‌రువాత సీన్ మారిపోయింది.పెళ్లికి ముందు సైన్ చేసిన సినిమాలు త‌ప్ప ఇంకో సినిమా ఈ అమ్మ‌డి చేతిలో లేదు.ప్రస్తుతం తెలుగులో రాంచ‌ర‌ణ్‌తో చేస్తున్న‌ రంగస్థలం,మహానటి సినిమాలు కూడా పెళ్లికి ముందు ఓప్పుకున్న సినిమాలే కావడం విశేషం.అటు తమిళ్ లో కూడా రెండు సినిమాలు లైన్లో ఉన్నాయి. ఇలాంటి స‌మయంలో స‌మంత బుల్లితెర‌కు ఎంట్రీ ఇస్తున్నారు.ఓ టీవీ ఛానెల్ కు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించబోతోంది సమంత.

అవును జీ తెలుగు ఛానెల్ కు సమంత ప్రచారకర్తగా పని చేయనుంది. ఈ మేరకు ఛానెల్ ప్రతినిధులు, సమంత మధ్య అగ్రిమెంట్ పూర్తయింది. ఛానెల్ లో పలు సీరియళ్లు, సినిమాలకు ప్రచారం కల్పించబోతోంది సమంత. ఆమెపై షూటింగ్ కూడా కంప్లీట్ చేశారు. ఇదే ఛానెల్ కు తమన్న బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించింది. ఆమెతో డీల్ కంప్లీట్ అయిపోవడంతో ఇప్పుడు సమంతను తీసుకున్నారు. ఈ ఛానెల్ కు ప్రచారకర్తగా వ్యవహరించేందుకు కోటి 50 లక్షల రూపాయలు తీసుకుందట సమంత.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -